News July 22, 2024
ఒలింపిక్స్లో ఇజ్రాయెల్ అథ్లెట్లను స్వాగతించం: ఫ్రాన్స్ ఎంపీ

పారిస్లో జరిగే ఒలింపిక్స్-2024 క్రీడలకు వచ్చే ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలకబోమని ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టెస్ ప్రకటించారు. ‘గాజాలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై ఒలింపిక్స్లో నిషేధం విధించేలా ప్రజా ప్రతినిధులు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై ఒత్తిడి తీసుకురావాలి. రష్యా తరహాలోనే ఇజ్రాయెల్నూ చూడాలి’ అని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని ఫ్రాన్స్ యూదుల గ్రూప్ ఖండించింది.
Similar News
News November 3, 2025
APPLY NOW: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్: https://uoc.ac.inను సంప్రదించండి.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు.
News November 3, 2025
గుండెలు పగిలే ఫొటో

TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన <<18183124>>ఆర్టీసీ బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించగా, అందులో 10 నెలల పాప కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.


