News August 13, 2024

ఇజ్రాయిల్‌ దాడులు: గాజా జనాభాలో 1.8% మంది మృతి

image

ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలోని మొత్తం జనాభాలో 1.8 శాతం మంది మరణించారు. వీరిలో 75 శాతం మంది 30 ఏళ్లలోపు వారే. అలాగే 16,456 మంది చిన్నారులు మృతి చెందారు. 11,088 మంది మహిళలు, 885 మంది వైద్య సిబ్బంది, 168 మంది జర్నలిస్టులు, 79 మంది సౌర రక్షణ సిబ్బంది ఉన్నారు. మొత్తం 3,486 సార్లు దాడి చేయగా 39,897 మంది చనిపోగా, 92,152 మంది గాయపడ్డారని పాలస్తీనా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ డేటా పేర్కొంది.

Similar News

News November 22, 2025

కొత్త లేబర్ కోడ్‌లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: సీఎం

image

<<18351140>>కొత్త లేబర్ కోడ్‌లు<<>> భారత అభివృద్ధికి మైలురాళ్లని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలకమార్పులుగా లేబర్ కోడ్‌లు నిలుస్తాయన్నారు. ‘వీటితో కార్మికులకు ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాల హామీ ఉంటుంది. గిగ్ వర్కర్లకు రక్షణ, మహిళలకు మరింత సమానత్వం లభిస్తుంది. ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే సంస్కరణ ఇది. వీటిని అందించిన PMకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

News November 22, 2025

చెత్త రికార్డు.. టెస్టు చరిత్రలోనే తొలిసారి

image

యాషెస్ తొలి టెస్టులో చెత్త రికార్డు నమోదైంది. వరుసగా మూడు ఇన్నింగ్సుల్లో ఒక్క రన్ చేయకుండా ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. టెస్టు చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులో జాక్ క్రాలే, AUS తొలి ఇన్నింగ్స్‌లో వెదరాల్డ్ డకౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో ENG: 172/10, AUS: 132/10 రన్స్ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లకు ENG 104 పరుగుల ఆధిక్యం(64/1)లో కొనసాగుతోంది.

News November 22, 2025

ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా మారి బుధవారానికి తుఫానుగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ప్రకాశం, NLR, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.