News July 13, 2024
గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు: 71 మంది మృతి

గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. దీంతో 71 మంది సాధారణ ప్రజలు మరణించగా 289 మంది గాయాలపాలయ్యారు. కాగా ఖాన్ యూనిస్ ప్రాంతంలోనే హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారని, అందుకే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇప్పటివరకు గాజా నరమేధంలో 38,300 మంది మరణించారు. 88,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాజాలోని 80 శాతం ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.
Similar News
News April 2, 2026
రాముడి లుక్కు ఫిదా.. VFXపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు!

నితేశ్ తివారీ ‘రామాయణ’ <<19543549>>టీజర్పై<<>> SMలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’ కంటే బెటర్ అని కొందరు.. అంతా ఏఐ వీడియోలా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో VFX క్వాలిటీ, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
News April 2, 2026
ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ భేటీ

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం నేపథ్యంలో ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. PMను మంగళగిరి శాలువాతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను లోకేశ్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
News April 2, 2026
30రోజుల్లో 10 T20లు.. టీమ్ఇండియాకు బిజీ షెడ్యూల్

IPL తర్వాత టీమ్ఇండియా టీ20ల షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. జూన్ 26 నుంచి జులై 26వ తేదీ మధ్య నెల రోజుల వ్యవధిలో ఏకంగా 10 టీ20 మ్యాచులు ఆడనుంది. జూన్ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్తో 2 టీ20ల్లో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత జులై 1, 4, 7, 9, 11వ తేదీల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. మళ్లీ జులై 23, 25, 26వ తేదీల్లో జింబాబ్వేతో ఆడనుంది. ఇక IPLలో రాణించే యువ క్రికెటర్లు ఈ సిరీసులకు సెలెక్ట్ అయ్యే అవకాశముంది.


