News July 13, 2024

గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు: 71 మంది మృతి

image

గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. దీంతో 71 మంది సాధారణ ప్రజలు మరణించగా 289 మంది గాయాలపాలయ్యారు. కాగా ఖాన్ యూనిస్ ప్రాంతంలోనే హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారని, అందుకే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇప్పటివరకు గాజా నరమేధంలో 38,300 మంది మరణించారు. 88,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాజాలోని 80 శాతం ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

Similar News

News December 5, 2025

మాలధారణలో ఉన్నప్పుడు బంధువులు మరణిస్తే..?

image

అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రక్తసంబంధీకులు మరణిస్తే వెంటనే మాల విసర్జన చేయాలి. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువు అయినందున గురుస్వామి వద్ద ఆ మాలను తీసివేయాలి. ఈ నియమం పాటించిన తర్వాత ఓ ఏడాది వరకు మాల ధరించకూడదు. అయితే దూరపు బంధువులు, మిత్రులు మరణిస్తే, మాలధారులకు ఎలాంటి దోషం ఉండదు. వారు మరణించినవారిని తలచుకొని, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>

News December 5, 2025

వారికి కూడా చీరలు.. సీఎం కీలక ప్రకటన

image

TG: 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను అందించే బాధ్యత మంత్రులు సీతక్క, సురేఖకు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ చెప్పారు. ‘ప్రస్తుతం 65L చీరలు పంపిణీ చేశాం. ఇంకా 35L చీరలు రావాలి. ఎన్నికల కోడ్‌తో ఆగిన చోట్ల, పట్టణ ప్రాంతాల మహిళలకూ MAR 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు ఇస్తాం’ అని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు, వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రస్తుతం చీరలు ఇస్తున్న విషయం తెలిసిందే.

News December 5, 2025

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్

image

TG: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని CM రేవంత్ అన్నారు. వరంగల్(D) నర్సంపేట సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, తాము ఒకేసారి ₹20,614Cr మాఫీ చేశామని తెలిపారు. ‘KCR పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం లక్షలాది మందికి ఇచ్చాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.