News January 28, 2025
ఇస్రో హు‘షార్’.. రేపే ‘సెంచరీ’ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్లో రేపు వందో ప్రయోగం చేపట్టనుంది. ఉ.6.23 గంటలకు GSLV-F15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. 2,250KGల బరువున్న ఈ శాటిలైట్ను 36,000KM దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇది దేశ నావిగేషన్ సిస్టం కోసం పనిచేయనుంది. ప్రయోగాన్ని ఇస్రో యూట్యూబ్ ఛానల్లో ఉ.5.50 నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
Similar News
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండండి: వైద్యులు

AP: ‘<<18454752>>స్క్రబ్ టైఫస్<<>>’ కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీటకాల తాకిడి ఆగస్టు-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


