News March 9, 2025

ఇస్రోకు త్వరలో రెండు కొత్త లాంచ్ ప్యాడ్‌లు

image

ISRO త్వరలో రెండు కొత్త లాంచ్‌ప్యాడ్‌లను ప్రారంభించనుందని ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. ఏపీలోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖరపట్టిణంలో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. రెండేళ్లలోపు ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. చంద్రయాన్-4ను 2028లో ప్రయోగిస్తామని, చంద్రునిపై నమూనాలను సేకరించడమే దాని లక్ష్యమని పేర్కొన్నారు. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తలకు పురుషులతో సమానంగా అవకాశాలు ఉంటాయన్నారు.

Similar News

News October 30, 2025

2020 ఢిల్లీ అల్లర్లు: పోలీసుల అఫిడవిట్‌లో సంచలన విషయాలు

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు CAA వ్యతిరేక నిరసనల పేరుతో అల్లర్లు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఖలీద్, ఇమామ్, హైదర్ తదితరుల బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించారని అందులో పేర్కొన్నారు.

News October 30, 2025

కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

image

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.

News October 30, 2025

టెస్టుల్లో కొత్త సంప్రదాయం.. ఇక రెండు టీ బ్రేకులు!

image

టెస్టుల్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ నుంచి 2 టీ బ్రేక్స్ అమలు కానున్నాయని తెలుస్తోంది. ఫస్ట్ సెషన్ 9-11am, సెకండ్ సెషన్ 11-20am-1.20pm, మూడో సెషన్ 2-4pmగా ఉండనుందని క్రీడా వర్గాలు తెలిపాయి. లంచ్‌కు ముందు ఒకటి, తర్వాత మరో టీ బ్రేక్ అమల్లోకి రానుందని వెల్లడించాయి. ప్రస్తుతం లంచ్ తర్వాత మాత్రమే టీ బ్రేక్ ఉన్న సంగతి తెలిసిందే.