News October 18, 2024
విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

TG: రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు, వెంకటేశ్, జ్యోత్స్నను నియమించింది. అంతకుముందు కమిషన్ ఛైర్మన్గా ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 9, 2025
ఎన్యూమరేటర్లకు బెదిరింపులు.. ECIకు సుప్రీం నోటీసులు

SIR చేపట్టిన BLOలకు భద్రత కల్పించాలని దాఖలైన పిటిషన్లపై తమ వైఖరి తెలపాలని ECI, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. డోర్-టు-డోర్ సర్వేకు వెళ్లిన వారిని ముఖ్యంగా బెంగాల్లో అడ్డుకుంటున్నారని, బెదిరిస్తున్నారని వేసిన రెండు పిటిషన్లను CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ బెంచ్ నేడు విచారించింది. పరిస్థితిని అదుపులోకి తేవాలని లేదంటే దారుణాలు జరుగుతాయని ECని CJI ఆదేశించారు.
News December 9, 2025
ట్రెండ్ను ఫాలో అవుతున్న అభ్యర్థులు.. SMలో జోరుగా ప్రచారం!

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి కొత్త ఒరవడి కనిపిస్తోంది. అభ్యర్థులు ప్రజాక్షేత్రంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. MLA ఎన్నికల మాదిరిగా ప్రత్యేక పాటలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకూ ఊర్లో ఉంటూ రీల్స్ చేసే యువ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పోటీలో ఉండటం విశేషం. దీంతో పోటీదారులు సంప్రదాయ రాజకీయాలను పక్కనపెట్టి కొత్త ట్రెండ్కు తెరలేపారు. వీరు యువతను ఆకర్షించేందుకే మొగ్గుచూపుతున్నారు.
News December 9, 2025
డిజిటల్గా జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

జనగణన-2027ను డిజిటల్గా చేపట్టనున్నట్లు కేంద్రం లోక్సభలో వెల్లడించింది. ‘మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిస్తాం. ప్రజలు వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు అందించే అవకాశం కల్పిస్తాం. ప్రతి ఒక్కరి వివరాలను ప్రస్తుతం వారు నివసిస్తున్న చోటే సేకరిస్తాం. వారు జన్మించిన ప్రాంతం, గతంలో నివసించిన చోటు నుంచి కూడా డేటా తీసుకుంటాం. వలసలకు కారణాలు తెలుసుకుంటాం’ అని వివరించింది. జనగణన <<18451693>>రెండు దశల్లో<<>> జరగనుంది.


