News October 18, 2024

విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

image

TG: రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు, వెంకటేశ్, జ్యోత్స్నను నియమించింది. అంతకుముందు కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 31, 2025

Asia Cup: ఒకట్రెండు రోజుల్లో భారత్‌కు ట్రోఫీ!

image

ఆసియా కప్ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో ACC చీఫ్ నఖ్వీ అందజేసే అవకాశం ఉందని BCCI ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నవంబర్ 4న ICC మీటింగ్ ఉండటంతో ఆ లోపు ఇస్తారని అంచనా వేస్తోంది. మరోవైపు నెల రోజులవుతున్నా ట్రోఫీని ఇవ్వకపోవడం సరి కాదని BCCI సెక్రటరీ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకట్రెండు రోజుల్లో అది ముంబైలోని బీసీసీఐ ఆఫీసుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే ICC దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

News October 31, 2025

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టవచ్చా?

image

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం ప్రమాదకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రాంతాల్లో నిర్మించిన గృహాల్లోకి వర్షాకాలంలో నీరు వచ్చే అవకాశాలుంటాయి. ఇంట్లోకి తేమ చేరితే అనారోగ్యం వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సౌరశక్తి, ప్రాణశక్తి కూడా తక్కువే. దీనివల్ల నివాసంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. స్థిరమైన, సుఖమైన జీవనం కోసం ఎత్తుగా, సమతలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>

News October 31, 2025

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త

image

AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు RTC ఆస్పత్రులతోపాటు EHS హాస్పిటల్స్‌లోనూ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 JAN 1 తర్వాత రిటైరైన వారికి ఈ సౌకర్యం వర్తించనుంది. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు ₹38,572, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు ₹51,429 ఓసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం చికిత్స పొందవచ్చు. రెగ్యులర్ ఉద్యోగుల్లా రీయింబర్స్‌మెంట్ సౌకర్యమూ ఉంటుంది.