News May 21, 2024
కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ: పొంగులేటి

TG: ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ‘అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’ అని ఆయన హామీ ఇచ్చారు.
Similar News
News December 5, 2025
PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
News December 5, 2025
పండ్లు, కూరగాయలు తినే ముందు ఇది గుర్తుంచుకోండి

వ్యవసాయంలో అధిక దిగుబడి, చీడపీడల నివారణ కోసం ఈ మధ్యకాలంలో పంటలపై క్రిమిసంహారకాలు, కలుపు మందుల వాడకం ఎక్కువైంది. పంటకాలం పూర్తై, విక్రయించిన తర్వాత కూడా పురుగు మందుల అవశేషాలు పండ్లు, కూరగాయల నుంచి తొలగిపోవు. అందుకే మనం తినే ముందు వీటిని తప్పనిసరిగా శుభ్రం చేసి తినాలి. లేకుంటే ఈ అవశేషాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరితే క్యాన్సర్, గుండె జబ్బులు, అంగ వైకల్యం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్సుంది.
News December 5, 2025
102 ఉద్యోగాలకు నోటిఫికేషన్

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 102 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ మార్క్స్&జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఎగ్జామినర్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్&ట్రేడ్ మార్క్స్ కార్యాలయం, ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్లో 100 పోస్టులు, UPSCలో 2 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://upsc.gov.in


