News October 28, 2024

అన్న క్యాంటీన్‌లకు విరాళమిస్తే ఐటీ మినహాయింపు

image

AP: అన్న క్యాంటీన్ పేరుతో ప్రభుత్వం ఛారిటబుల్ ట్రస్టును వచ్చే నెలలో ఏర్పాటుచేయనుంది. ఇందుకు IT శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాలు అనుమతి ఇచ్చాయి. విరాళాలు ఇచ్చే వారికి IT మినహాయింపు లభించనుంది. కార్పొరేట్ కంపెనీలు, సామాన్యుల నుంచి విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ అందుబాటులోకి రానుంది. 100 క్యాంటీన్లలో మూడు పూటలకు కలిపి రూ.26.25 లక్షలు ఇచ్చేవారికి రోజంతా వారిపేరుతోనే ఆహారం అందిస్తారు.

Similar News

News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./

News November 19, 2025

రాష్ట్రంలో 78 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS, DNB, PG, పీజీ డిప్లొమా, DM, M.CH, MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: rajannasircilla.telangana.gov.in./