News September 14, 2024

ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి నేటికి 17 ఏళ్లు పూర్తి

image

మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ ఇండియా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2007 సెప్టెంబర్ 14న ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టారు. ధోనీ కెప్టెన్సీ చేపట్టిన వెంటనే 2007 టీ20 WC సాధించారు. ఆ తర్వాత సీబీ సిరీస్ 2008, ఐపీఎల్ 2010, సీఎల్ టీ20 2010, ఆసియా కప్ 2010, odi WC 2011, ఐపీఎల్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013, సీఎల్ టీ20 2014, ఆసియా కప్ 2016, ఐపీఎల్ 2018, 21, 23లో టైటిళ్లు సాధించారు.

Similar News

News November 28, 2025

RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

image

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్‌లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్‌లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.

News November 28, 2025

ALERT.. పెరగనున్న చలి

image

ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి (<10°C) పడిపోతాయని, HYDలో 10°Cగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు నార్త్, సెంట్రల్ TGలో 9-11°Cగా ఉంటాయన్నారు. తుఫాన్ ప్రభావంతో DEC 2-5 వరకు MHBD, భద్రాద్రి, సూర్యాపేట్, NGKL, వనపర్తి, MBNRలో మోస్తరు వర్షాలకు ఛాన్సుందని వివరించారు.

News November 28, 2025

సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

image

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.