News September 14, 2024
ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి నేటికి 17 ఏళ్లు పూర్తి

మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ ఇండియా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2007 సెప్టెంబర్ 14న ఆయన సారథ్య బాధ్యతలు చేపట్టారు. ధోనీ కెప్టెన్సీ చేపట్టిన వెంటనే 2007 టీ20 WC సాధించారు. ఆ తర్వాత సీబీ సిరీస్ 2008, ఐపీఎల్ 2010, సీఎల్ టీ20 2010, ఆసియా కప్ 2010, odi WC 2011, ఐపీఎల్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013, సీఎల్ టీ20 2014, ఆసియా కప్ 2016, ఐపీఎల్ 2018, 21, 23లో టైటిళ్లు సాధించారు.
Similar News
News December 9, 2025
HURLలో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్ (<
News December 9, 2025
ఇండియాస్ హాకీ విలేజ్ గురించి తెలుసా?

14 మంది ఒలింపియన్లు సహా 300 మంది హాకీ ప్లేయర్లను ఇచ్చింది పంజాబ్ జలంధర్ దగ్గరలోని సన్సర్పూర్. హాకీని సంస్కృతిగా చూశారు గనుకే ఒక ఒలింపిక్స్లో ఐదుగురు ఇండియాకు, ఇద్దరు హాకీ ప్లేయర్లు కెన్యాకు ఆడారు. హాకీనే ఊపిరిగా తీసుకున్న ఆ గ్రామ వైభవాన్ని వసతుల లేమి, వలసలు మసకబార్చాయి. టర్ఫ్ గ్రౌండ్స్, అకాడమీలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుతో సన్సర్పూర్కు పునర్వైభవం తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
News December 9, 2025
పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యం: భట్టి

TG: తెలంగాణ రైజింగ్ కోసం తమ ప్రభుత్వం నియంత్రించేదిగా కాకుండా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘TG ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఉత్పాదకత పెంపే తెలంగాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం. ‘తెలంగాణ రైజింగ్ 2047’ పత్రం కాదు ప్రతిజ్ఞ’’ అని వివరించారు. పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యమన్నారు.


