News June 27, 2024

ప్రజలు పశువుల్లా ప్రయాణించాల్సి రావడం సిగ్గుచేటు: ముంబై హైకోర్టు

image

ముంబై లోకల్ ట్రైన్లలో <<10655919>>ప్రమాదకర<<>> రీతిలో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు పెరగడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజలు పశువుల్లా ప్రయాణించాల్సి రావడం సిగ్గుచేటు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఈ దయనీయ పరిస్థితులకు సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారులదే బాధ్యత. పరిష్కార మార్గాలపై అఫిడవిట్ దాఖలు చేయండి’ అని ఆదేశించారు.

Similar News

News October 31, 2025

నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.

News October 31, 2025

IND, AUS మ్యాచులో నమోదైన రికార్డులు

image

* ఉమెన్స్ ODIsలో హైయెస్ట్ రన్ ఛేజ్ ఇదే(339)
* WC నాకౌట్ మ్యాచులో ఇదే ఫస్ట్ 300+ రన్ ఛేజ్
* ఉమెన్స్ ODI WC ఫైనల్‌కు భారత్ రావడం ఇది మూడోసారి. 2005, 2017లో రన్నరప్‌గా నిలిచింది
* WCలో AUS వరుస విజయాలకు(15M తర్వాత) బ్రేక్
* WC నాకౌట్ మ్యాచుల్లో ఛేజింగ్‌లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌‌గా జెమీమా
* ఉమెన్స్ వన్డేల్లో 2 ఇన్నింగ్స్‌లు కలిపి ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్-679

News October 31, 2025

బాహుబలి యూనివర్స్‌లో కొత్త సినిమా ప్రకటన

image

బాహుబలి యూనివర్స్‌లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్‌ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్‌తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.