News September 16, 2024

రాజీవ్ విగ్రహం కూల్చేస్తామనడం సిగ్గుచేటు: కోమటిరెడ్డి

image

TG: సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామన్న KTRపై మంత్రి కోమటి రెడ్డి ఫైర్ అయ్యారు. ‘KTR మానసిక ఆరోగ్యంపై అనుమానాలున్నాయి. ఆయన వెంటనే డాక్టర్లతో చెక్ చేయించుకోవాలి. యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని భావించి, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహా నేత రాజీవ్ గాంధీ. ఆయన విగ్రహం కూల్చేస్తామనం సిగ్గుచేటు’ అని రాజీవ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో మండిపడ్డారు.

Similar News

News January 25, 2026

మీరు చదివిన స్కూల్ ఇప్పుడు ఉందా..?

image

మనం చదివిన స్కూల్, కాలేజ్ ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే. కానీ ప్రైవేట్లో చదివిన చాలామంది స్కూళ్లు, కాలేజెస్ ఇప్పుడు లేవు. పేరు, మేనేజ్మెంట్ మారడం, ఆ బిల్డింగ్‌లో మరొకటి కొనసాగడం సహా కొన్ని చోట్లయితే అసలు ఆ నిర్మాణాలే లేవు. ఇంకొందరికైతే స్కూల్ to కాలేజ్ ఏవీ లేవు. ఆ డేస్ గురించి ఫ్రెండ్స్, ఫ్యామిలీ చిట్‌చాట్లో ఈ మధ్య ఎక్కువగా ఇవి విన్పిస్తున్నాయి. ఇంతకీ మీరు చదివినవి ఇప్పుడున్నాయా? కామెంట్ చేయండి.

News January 25, 2026

చిరంజీవి-బాబీ మూవీ.. టైటిల్ ఇదేనా?

image

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ టైటిల్‌పై SMలో టాక్ నడుస్తోంది. ‘కాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తారని, కుమార్తెగా కృతి శెట్టి కనిపిస్తారని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకు బాబీ హిట్ ఇవ్వడం తెలిసిందే.

News January 25, 2026

భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

image

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.