News August 15, 2024
నెహ్రూ వల్లే దేశం ఈ స్థాయిలో ఉంది: రేవంత్

నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందని స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా CM రేవంత్ అన్నారు. ‘ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను మనం ఇప్పుడు ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్నాం. వాటి వల్ల దేశం సస్యశ్యామలంగా ఉంది. BHEL, IDPL, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు వేశారు. లాల్బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యవసాయంలో నూతన విప్లవాలు తెచ్చారు’ అని CM కొనియాడారు.
Similar News
News December 31, 2025
యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్(నా అన్వేషణ)పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్లోనూ అన్వేష్పై <<18701726>>ఫిర్యాదు<<>> చేసిన సంగతి తెలిసిందే. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి RAPE అంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
News December 31, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.320 తగ్గి రూ.1,35,880కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పతనమై రూ.1,24,550 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 31, 2025
అయామ్ సెమనీ కోడికి ఎందుకు అంత ధర?

అయామ్ సెమనీ కోడి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కనిపిస్తుంది. ఈ కోడి చర్మం, మాంసం, ఎముకలు, అవయవాలు, ఈకలు అన్నీ నలుపే. రక్తం ముదురు ఎరుపుగా ఉంటుంది. గుడ్లు మాత్రం బ్రౌన్ కలర్లో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, జన్యు మార్పుల వల్ల సెమనీ కోళ్లకు ఈ రంగు వచ్చింది. ఇండోనేషియా ప్రజలు ఈ కోడిని పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదిగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్ వల్లే ఈ కోడి ధర కిలో రూ.2 లక్షలకు పైనే ఉంటుంది.


