News August 15, 2024
నెహ్రూ వల్లే దేశం ఈ స్థాయిలో ఉంది: రేవంత్

నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందని స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా CM రేవంత్ అన్నారు. ‘ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను మనం ఇప్పుడు ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్నాం. వాటి వల్ల దేశం సస్యశ్యామలంగా ఉంది. BHEL, IDPL, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు వేశారు. లాల్బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యవసాయంలో నూతన విప్లవాలు తెచ్చారు’ అని CM కొనియాడారు.
Similar News
News December 1, 2025
ఏపీలో 10 చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్

APలోని 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. సీ ప్లేన్స్ ఆపరేషన్లకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనుందని చెప్పింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతిలలో వీటిని ఏర్పాటు చేస్తారని పేర్కొంది. కాగా సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.
News December 1, 2025
పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.
News December 1, 2025
హనుమాన్ చాలీసా భావం – 26

సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై ||
మనసు, మాట, కర్మ.. ఈ త్రికరణ శుద్ధితో హనుమంతుడిపై భక్తి ఉంచితే ఆయన మనల్ని భయాల నుంచి కాపాడతాడు. కష్టాల నుంచి విముక్తులను చేస్తాడు. మన ఆలోచనలో, ఆచరణలో, మాటలో భక్తి భావం ఉన్నవారికి ఆంజనేయుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలా లభించినవారు కష్టాలను దాటి, జీవితంలో అపార విజయాన్ని అందుకుంటారు. <<-se>>#HANMANCHALISA<<>>


