News May 10, 2024

దేశాన్ని విభజించి పాలించాలనేది కాంగ్రెస్ కుట్ర: మోదీ

image

భారతీయుల పట్ల కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారు. దేశాన్ని విభజించి పాలించాలనేది కాంగ్రెస్ కుట్ర. శ్రీరామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు వారు మాట్లాడుతున్నారు. రాముడిని పూజించడం దేశద్రోహమా? బుద్ధం శరణం గచ్చామి ఇండియా సిద్ధాంతం. అహింసో పరమోధర్మో అనేది భారత్ సిద్ధాంతం’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 18, 2025

కొండెక్కిన ‘కోడిగుడ్డు’

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్‌లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్‌లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

News November 18, 2025

కొండెక్కిన ‘కోడిగుడ్డు’

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్‌లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్‌లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt