News March 20, 2025

రైల్వే‌జోన్‌‌ను YCP ఖాతాలో వేసుకోవడం దారుణం: పయ్యావుల

image

AP: విశాఖలో PM మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల ఘనత YCPదే అని మండలిలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడంతో మంత్రులు మండిపడ్డారు. కనీసం రైల్వే‌జోన్‌కు భూమి ఇవ్వకుండా ప్రధాని శంకుస్థాపనను YCP తమ ఖాతాలో వేసుకుంటోందని పయ్యావుల విమర్శించారు. గత ప్రభుత్వం విధ్వంసానికి అమరావతే సాక్ష్యమన్నారు. గత ప్రభుత్వమే భూమి ఇచ్చి, క్లియరెన్స్‌లు తెస్తే శంకుస్థాపన ఎందుకు చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు.

Similar News

News December 12, 2025

మునగాకుతో ఎన్నో లాభాలు

image

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

News December 12, 2025

తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో

image

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ❤️’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.

News December 12, 2025

‘అల్లూరి’ ప్రమాదంలో చనిపోయింది వీరే

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన <<18540010>>ప్రమాదంలో<<>> 9 మంది చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వివరాలు.. శైలా రాణి(తెనాలి), శ్యామల(తిరుపతి), పి.సునంద(పలమనేరు), శివశంకర్ రెడ్డి(పలమనేరు), నాగేశ్వరరావు(చిత్తూరు), కావేరి కృష్ణ(బెంగళూరు), శ్రీకళ(చిత్తూరు), దొరబాబు(చిత్తూరు), కృష్ణకుమారి(బెంగళూరు). కాగా గాయపడిన 25 మందికి చింతూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.