News October 29, 2024
ఓ బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోవడం కష్టం: విజయమ్మ

AP: ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా ధర్మం. నా విధి. ఇంతమంది పెద్దలు చెప్తున్న అబద్ధాల మధ్య నిజాలు తెలియాలనే మీ మందుకు వచ్చా. YSR బతికి ఉంటే ఆస్తుల సమస్య వచ్చేది కాదు. దీనిపై ఇక ఎవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు’ అని లేఖలో కోరారు.
Similar News
News December 20, 2025
ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు ఎందుకొస్తాయంటే?

గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు తరచూ చాలా మంది కాళ్లలో వాపు వస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. మెల్లగా కాకుండా ఒక్కరోజులోనే కాళ్లు బాగా వాచిపోవడం, నొక్కితే సొట్ట పడిన తర్వాత అది మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడినప్పుడు జాగ్రత్త పడాలి. రెండుకాళ్లు కాకుండా ఒక కాలే వాస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 20, 2025
స్టార్బక్స్ CTOగా భారత సంతతి వ్యక్తి ఆనంద్ వరదరాజన్

ప్రపంచ ప్రఖ్యాత కాఫీ స్టార్బక్స్ తమ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన ఆనంద్ వరదరాజన్ను నియమించింది. ఆయన గతంలో 19 ఏళ్ల పాటు అమెజాన్లో పనిచేశారు. అక్కడ గ్లోబల్ గ్రోసరీ బిజినెస్కి టెక్నాలజీ అండ్ సప్లైచైన్ హెడ్గా పనిచేశారు. ఒరాకిల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. IIT నుంచి అండర్గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత పర్డ్యూ, వాషింగ్టన్ యూనివర్సిటీల నుంచి మాస్టర్స్ చేశారు.
News December 20, 2025
మేడిగడ్డ వ్యవహారం.. L&Tపై క్రిమినల్ కేసు!

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పనులు చేపట్టిన L&T సంస్థపై క్రిమినల్ కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. L&Tపై క్రిమినల్ కేసుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి L&Tదే బాధ్యత అని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయనుంది.


