News April 7, 2024
అది జనజాతర కాదు.. అబద్ధాల జాతర: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది జనజాతర కాదని.. అబద్ధాల జాతర అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘6 గ్యారంటీల పేరుతో గారడీ చేశారు. నమ్మి ఓట్లేసిన 4 కోట్ల ప్రజలను నట్టేట ముంచారు. రైతుల ఆత్మహత్యలు, నేతన్నల బలవన్మరణాలకు కాంగ్రెస్ కారణమవుతోంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. రుణమాఫీ, తాగు, సాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. వీళ్ల ఆర్తనాదాలు వినిపించట్లేదా రాహుల్ గాంధీ’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 24, 2025
మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ కోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.
News November 24, 2025
మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ కోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.
News November 24, 2025
రైతన్న మీకోసం పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల 24 నుంచి 30 వరకు నిర్వహించనున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అమలాపురంలో కలెక్టరేట్లో జరిగిన టెలికాన్ఫరెన్స్లో ఆయన అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థవంతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.


