News August 1, 2024
ఇది ఒకరి విజయం, మరొకరి పరాజయం కాదు: మందకృష్ణ

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వంద తరాల భవిష్యత్తును నిర్దేశించబోతుందని మందకృష్ణ మాదిగ చెప్పారు. ‘ఒక పోరాటంలో న్యాయం జరుగుతుందని భవిష్యత్ తరాలకు ఈ తీర్పు ఆత్మవిశ్వాసం అందిస్తుంది. ఈ విజయంతో మాదిగ, ఉపకులాలు ముందడుగు వేస్తాయి. ఇది ఒక కులం విజయమో, మరో కులం అపజయమో కాదు. మాల సోదరులు అర్థం చేసుకోవాలి. అంబేడ్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ పంచడమే ఈ తీర్పు ఉద్దేశం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 18, 2026
లెక్క లెక్కే.. బుమ్రాకు న్యాయం చేసేలా BCCI ప్లాన్స్

కోహ్లీ, రోహిత్, జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ₹7 కోట్లు అందుకునేవారు. రోహిత్, కోహ్లీ ఒకే ఫార్మాట్ ఆడుతుండటం, జడేజా T20Iల నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం బుమ్రా ఒక్కరే 3 ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. దీంతో A+ కేటగిరీని తొలగించి అందరినీ A గ్రేడ్కు మార్చడంతో ఆయనకు ₹2 కోట్ల నష్టం జరుగుతోంది. దీన్ని భర్తీ చేసేందుకు BCCI కాంట్రాక్ట్ రివైజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అక్షర్, సిరాజ్ల కాంట్రాక్టూ మారొచ్చు.
News March 18, 2026
ఆ కళ్లద్దాలతో న్యూడ్, బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్!

మెటా AI స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారుల అత్యంత వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి కెన్యాలోని రివ్యూయర్లకు పంపిస్తున్నట్లు స్వీడిష్ పత్రికల ఇన్వెస్టిగేషన్లో తేలింది. దాని ప్రకారం.. న్యూడ్, బెడ్రూమ్, బాత్రూమ్ దృశ్యాలతో పాటు బ్యాంక్ కార్డుల వివరాలు అక్కడి సిబ్బందికి చేరుస్తున్నాయి. బ్లర్ చేసే టెక్నాలజీ పనిచేయక వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మెటాపై క్లాస్ యాక్షన్ దావా నమోదైంది.
News March 18, 2026
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

TG: మూసీ ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. మూసీ గురించి సభలో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతోందని KTR మండిపడ్డారు. సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ ఆ పార్టీ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. అయితే BRSకు మూసీ ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధి లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే వారికి లేదన్నారు.


