News December 30, 2024

ఆతిశీని కేజ్రీవాల్ టెంపరరీ సీఎం అనడం అవమానకరం: ఢిల్లీ LG

image

ఢిల్లీ CM ఆతిశీ మార్లేనాను అరవింద్ కేజ్రీవాల్ టెంపరరీ CM అనడం బాధించిందని లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా బాంబుపేల్చారు. ఇది ఒక రకంగా తనకూ అవమానమేనని పేర్కొన్నారు. న్యూఇయర్ విషెస్ చెబుతూ ఆమెకు లేఖ రాశారు. ‘మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను మనస్ఫూర్తిగా అభినందించాను. మీరు CM అవ్వడం నాకూ సంతోషమే. మీ పూర్వ CM చేయలేని పనులనూ మీరు చక్కబెడుతున్నారు. మంత్రిగానూ నిబద్ధతతో పనిచేశారు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 30, 2025

వారికి SBI అకౌంట్ ఉంటే చాలు ₹కోటి పరిహారం

image

SBIతో మార్చిలో కుదిరిన MoU ప్రకారం ఆ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ (SGSP) ఉన్న AP ప్రభుత్వ ఉద్యోగులకు ₹కోటి ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఈ భారీ పరిహారం నామినీకి అందుతుంది. ఎక్సైజ్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు జులైలో ప్రమాదవశాత్తు మరణించగా ఆయన కుటుంబానికి ₹కోటి పరిహారం తాజాగా అందింది. పథకం ప్రారంభమైన తర్వాత పరిహారం అందడం ఇదే మొదటిసారి.

News December 30, 2025

చరిత్ర చెబుతోంది.. వెండి ధరలు తగ్గుతాయ్: విశ్లేషకులు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు భారీగా పడిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ వెండి ధరలు పెరిగిన ప్రతిసారీ 40-90% పతనమయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఔన్స్‌ వెండి ధర 1980లో $50 నుంచి $5కి (90%), 2011లో $48 -$12కి (75%), 2020లో $30 -$18కి (40%) పడిపోయాయంటున్నారు. పారిశ్రామిక డిమాండ్, చైనా ఎగుమతి ఆంక్షలతో ధరలు పెరుగుతున్నా క్రమంగా తగ్గే ఛాన్స్ ఉందని ఇన్వెస్టర్లను అలర్ట్ చేస్తున్నారు.

News December 30, 2025

గర్ల్ ఫ్రెండ్‌తో ప్రియాంకా గాంధీ కుమారుడి ఎంగేజ్‌మెంట్!

image

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇవాళ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అవివా బేగ్‌తో ఎంగేజ్‌మెంట్ అయిందని నేషనల్ మీడియా పేర్కొంది. వారిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు తెలిపింది. రైహాన్ 2000 సంవత్సరంలో జన్మించారు. అవివా కుటుంబం ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.