News May 25, 2024
కోట్లకు పడగలెత్తిన వారిపై పన్నులు పెంచాలని సూచన

దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సంపన్నులపై కరోడ్పతి ట్యాక్స్ విధించాలని ఫ్రాన్స్కు చెందిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు సూచించారు. 2010 తర్వాత కోట్లకు పడగలెత్తిన వారి సంపదపై పన్ను, వారసత్వ పన్ను ఉండాలని తెలిపారు. ₹10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 2%, ₹100 కోట్లు దాటితే 4%.. వారసత్వ పన్ను ₹10 కోట్ల పైన 33%, ₹100 కోట్ల పైన 45% విధించాలని పేర్కొన్నారు. దీనిపై మీరేమంటారు?
Similar News
News November 28, 2025
SVU: పీజీలో సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)లో పీజీ (PG) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇందుకు PGCET పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో నేరుగా వర్సిటీలో హాజరుకావాలని ఆయన సూచించారు.
News November 28, 2025
శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.
News November 28, 2025
WPL వేలంలో అదరగొట్టిన తెలుగమ్మాయిలు

WPL 2026 వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ సత్తా చాటారు. గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ వారియర్స్, మమతను రూ.10 లక్షలకు ఢిల్లీక్యాపిటల్స్, క్రాంతిరెడ్డిని రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB జట్టు ఎంచుకుంది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.


