News September 21, 2024

తిరుమలలో అలా జరగడం ఘోరం, నికృష్టం: మోహన్ బాబు

image

‘తిరుమల లడ్డూ’ వివాదంపై నటుడు మోహన్‌బాబు ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా వర్సిటీ నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని నాతో పాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ నిత్యం భక్తితో నమస్కరిస్తుంటాం. అక్కడ ఇలా జరగడం ఘోరాతి ఘోరం, నికృష్టం, హేయం, అరాచకం. నేరస్థుల్ని శిక్షించాలని నా మిత్రుడు, AP CM చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News September 21, 2024

NPA డైరెక్టర్‌గా అమిత్ గార్గ్

image

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌కు చెందిన గార్గ్ 2027 అక్టోబర్ 31 వరకు పదవిలో ఉంటారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్‌గా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అలోక్ రంజన్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌ ఐపీఎస్ ఆఫీసర్లు రిత్విక్ రుద్ర, మహేశ్ దీక్షిత్, ప్రవీణ్ కుమార్, అరవింద్ కుమార్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.

News September 21, 2024

పెళ్లి చేసుకోమని ఆమె వేధించింది: జానీ మాస్టర్ భార్య

image

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోండని ఆమె జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచి, బయట పెళ్లి చేసుకోమనేది. మతం మార్చుకుంటానని కూడా చెప్పేది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్‌మెయిల్ చేసేది. ఆమె వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News September 21, 2024

జనవరిలో బీచ్ ఫెస్టివల్: దుర్గేశ్

image

AP: YCP ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కాకినాడలో NTR బీచ్‌ను ఆయన పరిశీలించారు. ‘YCP ప్రభుత్వం నిలిపివేసిన బీచ్ ఫెస్టివల్‌ను పునరుద్ధరిస్తాం. జనవరిలో నిర్వహిస్తాం. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి చేస్తాం’ అని దుర్గేశ్ వెల్లడించారు.