News May 12, 2024

తగిన బస్సులు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం: నాదెండ్ల

image

AP: ఓటు వేసేందుకు స్వస్థలాలకు వచ్చే ఓటర్లు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహన్ అన్నారు. ‘హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఉపాధి కోసం వెళ్లినవారు ఓటు వేయాలనే బాధ్యతతో వస్తున్నారు. అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయడం ఆర్టీసీ కనీస బాధ్యత. ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం దురదృష్టకరం. ఎన్నికల సంఘం స్పందించి సమస్యను పరిష్కరించాలి’ అని కోరారు.

Similar News

News September 19, 2025

ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

image

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.

News September 19, 2025

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.

News September 19, 2025

పోలీస్ శాఖలో 12,542 ఖాళీలు!

image

TG: పోలీస్ శాఖలో వివిధ కేటగిరీల్లో 12,542 ఖాళీ పోస్టులున్నాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తాజాగా ఆర్థికశాఖకు వివరాలు సమర్పించింది. అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో 8,442, ఏఆర్ కానిస్టేబుల్ 3,271, SI సివిల్ కేటగిరీలో 677, ఏఆర్‌లో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులున్నట్లు పేర్కొంది. వీటిని జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.