News March 30, 2024
DK శివకుమార్కు ఐటీ నోటీసులు

కర్ణాటక డిప్యూటీ CM డికె.శివకుమార్కు ITశాఖ నోటీసులు ఇచ్చింది. తనకు నిన్న రాత్రి ఇన్కం ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ‘కేంద్రంలోని BJP ప్రతిపక్షాలను ఎందుకు ఇలా వేధిస్తోంది? ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతో ఇవన్నీ చేస్తోంది. చివరికి కమ్యూనిస్టు పార్టీ నేతలను కూడా బీజేపీ టార్గెట్ చేసింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని మండిపడ్డారు.
Similar News
News December 12, 2025
OTTలోకి రెండు కొత్త సినిమాలు

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ’12A రైల్వే కాలనీ’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించారు. నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. అటు దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ నటించిన ‘కాంత’ మూవీ నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా NOV 14న విడుదలవగా మిక్స్డ్ టాక్ వచ్చింది.
News December 12, 2025
AAIలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News December 12, 2025
‘అఖండ-2’ నిర్మాతలు, BMSపై హైకోర్టు ఆగ్రహం

‘అఖండ-2’ నిర్మాతలు, బుక్ మై షో సంస్థపై హైకోర్టు ఆగ్రహించింది. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? పెంచిన ధరలతో టికెట్లు ఎందుకు విక్రయించారు?’ అని ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకున్నారని BMS నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అటు ధరల పెంపు GO రద్దుపై ఈ మూవీ నిర్మాతలు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.


