News January 10, 2025
IT స్టాక్స్ దూసుకుపోతున్నాయ్..

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్గా ఆరంభమయ్యాయి. Sensex 77,682(+62) వద్ద, Nifty 23,551 (+25) వద్ద ట్రేడింగ్ ఆరంభించాయి. 5 Min Time Frameలో Bullish Candle ఫాం అయ్యింది. IT స్టాక్స్ 2.23% లాభాలతో దూసుకుపోతున్నాయి. రియల్టీ, ఆయిల్&గ్యాస్ షేర్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Similar News
News December 8, 2025
సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకపై సూపర్ ఓవర్లో త్రిపుర థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 197/6 స్కోర్ చేయగా, త్రిపుర 197/8 చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో TRI 22 రన్స్ చేయగా, KA 18/1 స్కోర్ మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ ఆల్రౌండ్(35 బంతుల్లో 69 పరుగులు, 2 వికెట్లు; సూపర్ ఓవర్లో 5 రన్స్, 1 వికెట్) ప్రదర్శనతో అదరగొట్టారు.
News December 8, 2025
AI నియంత్రణపై ఆస్ట్రేలియా ఫోకస్..

16 ఏళ్లలోపువారు SM వాడటంపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు AI నియంత్రణపై దృష్టి పెట్టింది. కొత్త చట్టాలు చేయకుండా, అమలులో ఉన్న చట్టాలతోనే AIతో వచ్చే సమస్యల పరిష్కారానికి 2026 నాటికి భద్రతా సంస్థ ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ అభివృద్ధితో పెరుగుతున్న సమస్యల పరిష్కారానికి సంస్థ పనిచేస్తుంది. డేటా సెంటర్లకు పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి, ప్రజాభద్రత టార్గెట్గా పెట్టుకున్నట్టు చెప్పింది.
News December 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 90 సమాధానం

ప్రశ్న: రామాంజనేయుల నడుమ యుద్ధమెందుకు జరిగింది?
సమాధానం: రాముని గురువు విశ్వామిత్రుడిని కాశీ రాజు యయాతీ అవమానించాడు. దీంతో యయాతిని చంపమని రాముడిని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. అటువైపు తన ప్రాణాలు కాపాడమని యయాతి ఆంజనేయుడిని శరణు వేడాడు. అలా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆంజనేయుడు పలికిన రామనామం రాముని బాణాలు నిలవలేకపోయాయి. దీంతో విశ్వామిత్రుడు యుద్ధాన్ని ఆపి, యయాతిని క్షమించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>


