News October 28, 2024

రెండు రోజుల సమయం కావాలి: రాజ్ పాకాల

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని పోలీసులకు KTR బావమరిది రాజ్ పాకాల లేఖ రాశారు. రెండు రోజుల గడువు కోరుతూ మోకిల పోలీసులకు న్యాయవాదుల ద్వారా లేఖ పంపారు. ఇవాళ విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News December 25, 2025

SSCలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

image

SSCలో 326 గ్రేడ్-C స్టెనో‌గ్రాఫర్(LDCE) ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, హిందీ/ఇంగ్లిష్‌లో షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. CBTలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు స్టెనో‌గ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. వచ్చే నెల 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు, అర్హత, అప్లికేషన్, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 25, 2025

ఇంటర్ సెకండియర్ HTపై ఫస్టియర్ మార్కులు

image

TG: ఇంటర్ సెకండియర్ పరీక్షల హాల్‌టికెట్‌‌పై ఇక నుంచి ఫస్టియర్ మార్కులు, పాస్/ఫెయిల్ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది. కొందరు విద్యార్థులు ఫస్టియర్ మార్కులు తక్కువొచ్చినా, సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా పేరెంట్స్‌కు చెప్పట్లేదు. రెండో ఏడాది చివర్లో ఇది తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనికి చెక్ పెట్టడంతో పాటు విద్యార్థుల్లో జవాబుదారీతనం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.

News December 25, 2025

నైతిక రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం!

image

దేశంలో నైతిక రాజకీయాలకు విలువ తెచ్చిన అజాతశత్రువు అటల్ బిహారి వాజ్‌ పేయి. ఒక్క ఓటుతో ప్రధాని పీఠం చేజారుతున్నా ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడని వ్యక్తిత్వం ఆయనది. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో హాస్య చతురత మేళవించిన ప్రసంగాలు, ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు. రోడ్లతో పాటు ఎయిర్, రైల్, టెలీ, షిప్ కనెక్టివిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ‘భారతరత్న’ అయ్యారు. ఇవాళ వాజ్‌పేయి జయంతి.