News September 27, 2024
ఇది నిశ్శబ్ద విప్లవం: మన్సుఖ్ మాండవీయ

PM మోదీ తీసుకొచ్చిన విధానాలతో గత ఏడేళ్లలో మహిళా కార్మికులు రెట్టింపయ్యారని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రస్తుతం కొన్ని సెక్టార్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సమయం పనిచేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దీని గురించి మరింతగా మాట్లాడుకుంటామన్నారు. ఈ మార్పును నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించారు. మహిళలు ముందుండి బాధ్యతలు తీసుకుంటూ అడ్డంకులను బద్దలు కొడుతున్నారని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
Similar News
News March 13, 2025
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్(₹)ను తొలగించింది. రూపీ సింబల్కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.
News March 13, 2025
KKR కెప్టెన్గా రహానే.. కారణం ఇదే

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.