News July 27, 2024
భారత్కు తొలి క్షిపణిని అందించిన మహనీయుడు అబ్దుల్ కలాం

భారత్కు తొలి క్షిపణిని అందించి మిస్సైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు అబ్దుల్ కలాం. రాష్ట్రపతిగానూ పనిచేసిన ఆయన పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. 1931, అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. 2015 జులై 27న స్వర్గస్థులయ్యారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న బిరుదులు ఆయన పేరు ముందు చేరి మరింత ఇనుమడించాయి. నేడు ఆ మహనీయుని వర్ధంతి.
Similar News
News November 28, 2025
RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.
News November 28, 2025
ALERT.. పెరగనున్న చలి

ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి (<10°C) పడిపోతాయని, HYDలో 10°Cగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు నార్త్, సెంట్రల్ TGలో 9-11°Cగా ఉంటాయన్నారు. తుఫాన్ ప్రభావంతో DEC 2-5 వరకు MHBD, భద్రాద్రి, సూర్యాపేట్, NGKL, వనపర్తి, MBNRలో మోస్తరు వర్షాలకు ఛాన్సుందని వివరించారు.
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.


