News April 29, 2024
ఈ ‘పుతిన్’ ప్రభుత్వమే పవార్ను గౌరవించింది: మోదీ

NCP (SP) చీఫ్ శరద్ పవార్ తనను పుతిన్ అని అభివర్ణించడంపై ప్రధాని మోదీ స్పందించారు. “ఆయనపై ఎంతో గౌరవం ఉంది. ఈ ‘పుతిన్’ నేతృత్వంలోని ప్రభుత్వమే 2017లో ఆయనను పద్మవిభూషణ్తో గౌరవించినప్పుడు ఆయన గర్వంగా ఫీలయ్యారు” అని తెలిపారు. ED, CBI లేకుండా బీజేపీ ఎన్నికలు గెలవలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. 2014 ఎన్నికల టైమ్లోనూ ED, CBI ఉన్నాయని మరి కాంగ్రెస్ ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.
Similar News
News February 9, 2026
పిల్లల్లో ఆకలి పెంచాలంటే?

పిల్లలు ఏదైనా ఆటలు ఆడించేలా ప్రోత్సహించండి. శారీరక శ్రమ ఉంటే వాళ్లకి ఎక్కువ ఆకలి వేస్తుంది. ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచండి. పిల్లలకు తగినంత నిద్ర కూడా ముఖ్యం. రాత్రి త్వరగా పడుకుని.. ఉదయం త్వరగా మేల్కొనేలా పిల్లలకు అలవాటు చేయండి. ఈ ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల పిల్లలు తినడానికి ఆసక్తి చూపుతారు. ఆహారంలో మార్పులు, పిల్లల దినచర్యను ప్లాన్ చేయడం ద్వారా సహజంగా ఆకలిని పెంచవచ్చు.
News February 9, 2026
శ్రీవారి భక్తులకు శుభవార్త

AP: తిరుమలలో సులభంగా లడ్డూలు పొందేందుకు వీలుగా విక్రయ కేంద్రాల్లో UPI పేమెంట్లను అనుమతించాలని TTD నిర్ణయించింది. ప్రస్తుతం క్యాష్ ద్వారానే లడ్డూలు తీసుకునే పరిస్థితి ఉంది. కియోస్క్ యంత్రాలను అందుబాటులో తెచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులొస్తున్నాయి. దీంతో కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. తొలుత కొన్ని కౌంటర్లలో అమలు తర్వాత అన్ని కేంద్రాలకూ విస్తరిస్తారు.
News February 9, 2026
ట్రేడ్ డీల్లో రైతాంగానికి రక్షణ: అమూల్ చీఫ్

USతో ట్రేడ్ డీల్తో వ్యవసాయ రంగానికి <<19081420>>నష్టం కలుగుతుందని<<>> రైతు సంఘాలు ఆందోళన చెందుతుండటం తెలిసిందే. అయితే ఈ డీల్ రైతులు, వ్యవసాయ రంగానికి రక్షణ కల్పిస్తుందని అమూల్ చీఫ్ జయన్ మెహతా తెలిపారు. ‘వాణిజ్య చర్చలనేవీ ఎప్పుడూ రెండు వైపులా జరిగే విషయాలు. DDGS వంటి పశువుల దాణాను డీల్లో చేర్చినంత మాత్రాన ఎలాంటి నష్టం కలగదు. DDGS వాడకం చాలా తక్కువ. పాడి, వ్యవసాయ రంగంపై ఆందోళన అవసరం లేదు’ అని చెప్పారు.


