News October 19, 2025
నేడు ఇలా చేస్తే చాలా మంచిది

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.
Similar News
News February 4, 2026
‘కొరియానే మా లోకం’.. మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు!

ఘజియాబాద్(UP) సిస్టర్స్ <<19045678>>ఆత్మహత్య<<>> కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ముగ్గురూ కొరియన్ కల్చర్కు అడిక్ట్ అయ్యి పేర్లనూ మార్చుకున్నారని తండ్రి చేతన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొరియాను మా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అని తరచూ అనేవారట. సూసైడ్ లెటర్లో ‘అమ్మానాన్న సారీ’ అని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గది లోపల లాక్ చేసుకొని బాల్కనీ నుంచి దూకినట్లు తేలింది.
News February 4, 2026
విమానంలో చోరీ.. లగేజీలోని గోల్డ్, డైమండ్ ఆభరణాలు మాయం

విమాన ప్రయాణంలో తన లగేజీలోని గోల్డ్, వజ్రాలు పోయాయంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. అమెరికాలో స్థిరపడిన శాంతారమేశ్ గతేడాది నవంబర్ 15న బెంగళూరు నుంచి అబుదాబికి ప్రయాణించారు. అక్కడికి వెళ్లాక లగేజీలోని 790 గ్రా. గోల్డ్, రూ. 8లక్షల విలువైన వజ్రాభరణాలు, $200 నగదు మిస్సయినట్లు గుర్తించారు. విమానాశ్రయ అధికారులను సంప్రదించగా పరిష్కారం దొరక్కపోవడంతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 4, 2026
బిల్వ వృక్షం ఎలా పుట్టిందో తెలుసా?

మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా, లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది. దీనిని దేవతలు స్వర్గం, వైకుంఠం, మందర పర్వతంపై నాటారు. శివునికి ప్రీతికరమైన ఈ పత్రం లక్ష బంగారు పూలతో సమానం. సోమవారం కోసిన బిల్వ పత్రాలను ఆ రోజే పూజకు వాడాలని, ఎండినవి/కోసి 3 రోజులు దాటినవి వాడకూడదని శాస్త్రం చెబుతోంది. ఈ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే దోషాలు పోతాయని నమ్మకం.


