News July 22, 2024

అప్పుడూ డీజీపీని హెలికాప్టర్‌లో పంపి ఉంటే బాగుండేది: YCP

image

AP: మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాద ఘటనతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని YCP మండిపడింది. ‘హత్యలు, అత్యాచార ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే ఇది. కలెక్టర్, CCL ఆఫీసుల్లో, ఆన్‌లైన్‌లోనూ ఆ రికార్డులుంటాయి. YCP నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం, రషీద్ హత్య జరిగినప్పుడు DGPని ఇలాగే హెలికాప్టర్‌లో పంపి ఉంటే బాగుండేది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News December 12, 2025

2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

image

AP: గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.

News December 12, 2025

వారికి ఇంటర్ ఎగ్జంప్షన్‌ పేపర్‌కు మార్కులు

image

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్‌ పొందిన పేపర్‌కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్‌కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.

News December 12, 2025

నటికి క్యాన్సర్.. పాపం ఎలా అయ్యారో చూడండి

image

టాలీవుడ్‌ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్‌మెంట్‌కి సుమారు ₹35లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. విషయం తెలిసిన నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. అటు వాహిని త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.