News July 22, 2024
అప్పుడూ డీజీపీని హెలికాప్టర్లో పంపి ఉంటే బాగుండేది: YCP

AP: మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాద ఘటనతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని YCP మండిపడింది. ‘హత్యలు, అత్యాచార ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే ఇది. కలెక్టర్, CCL ఆఫీసుల్లో, ఆన్లైన్లోనూ ఆ రికార్డులుంటాయి. YCP నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం, రషీద్ హత్య జరిగినప్పుడు DGPని ఇలాగే హెలికాప్టర్లో పంపి ఉంటే బాగుండేది’ అని ట్వీట్ చేసింది.
Similar News
News December 16, 2025
విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

సూపర్ ఫామ్లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.
News December 16, 2025
TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News December 16, 2025
శనగలో ఇనుము లోప లక్షణాలు – నివారణ

సాధారణంగా సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి, ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో నాటిన శనగ పంటలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల లేత ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండి రాలిపోతాయి. నేలలకు ఫెర్రస్ సల్ఫేట్ నేరుగా అందించడం అంత లాభదాయకం కాదు. కాబట్టి ప్రతి లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా, ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల తేడాతో రెండు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


