News April 5, 2025

నన్ను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేది: చెన్నయ్య

image

TG: ప్రియుడి కోసం రజిత అనే మహిళ <<15981487>>ముగ్గురు కన్నబిడ్డలను<<>> చంపేయడంతో భర్త చెన్నయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తనను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేదని రోదిస్తున్నారు. ‘బిడ్డలకు విషం పెట్టి చంపి ఆత్మహత్యాయత్నం చేసినట్లు రజిత నాటకం ఆడింది. పిల్లలు చనిపోయారని చెబితే ఆమెకు చుక్క కన్నీరు రాలేదు. ఆమెను చంపేయడమే మంచిది. ఎన్‌కౌంటర్ చేయండి. అదే సరైన న్యాయం’ అని కోరుతున్నారు.

Similar News

News November 15, 2025

ప్రజాస్వామ్య విలువలు పతనం: జగన్

image

AP: హిందూపురంలోని YCP కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు <<18297222>>దాడి<<>> చేశారని జగన్ ట్వీట్ చేశారు. ‘ఈ అనాగరిక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నీచర్, అద్దాలను పగలగొట్టడం, కార్యకర్తలపై దాడి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుందని అన్నారు.

News November 15, 2025

SBI కస్టమర్లకు BIG ALERT

image

SBI కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30 తర్వాత ఆన్‌లైన్, యోనో లైట్ ద్వారా డబ్బును పంపే, క్లెయిమ్ చేసే mCASH సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. UPI, IMPS, NEFT, RTGS తదితర డిజిటల్ పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేయకుండానే మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు లావాదేవీలు చేయడం కోసం mCASHను గతంలో SBI తీసుకొచ్చింది.

News November 15, 2025

అంతులేని ప్రేమకూ ముగింపు తప్పదు!

image

అవసరాలు.. అంతులేని ప్రేమకూ ముగింపునిస్తాయని తెలిపే ఘటన చైనాలో జరిగింది. 2017లో జాన్ అనే మహిళ లంగ్ క్యాన్సర్‌తో ఎంతోకాలం జీవించదని డాక్టర్లు తెలిపారు. భార్యను అమితంగా ప్రేమించే భర్త జున్మిన్ ఆమెను cryopreservation పద్ధతిలో సంరక్షించేందుకు ఓ సంస్థతో 30ఏళ్ల ఒప్పందం చేసుకున్నాడు. ఇలా చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన అతను తోడులేకుండా ఉండలేనని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.