News April 5, 2025
నన్ను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేది: చెన్నయ్య

TG: ప్రియుడి కోసం రజిత అనే మహిళ <<15981487>>ముగ్గురు కన్నబిడ్డలను<<>> చంపేయడంతో భర్త చెన్నయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తనను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేదని రోదిస్తున్నారు. ‘బిడ్డలకు విషం పెట్టి చంపి ఆత్మహత్యాయత్నం చేసినట్లు రజిత నాటకం ఆడింది. పిల్లలు చనిపోయారని చెబితే ఆమెకు చుక్క కన్నీరు రాలేదు. ఆమెను చంపేయడమే మంచిది. ఎన్కౌంటర్ చేయండి. అదే సరైన న్యాయం’ అని కోరుతున్నారు.
Similar News
News April 6, 2025
వృద్ధి రేటులో రెండో స్థానంలో ఏపీ: CBN

AP: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు(8.21%) సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే తమ విధానాలతో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ పునరుజ్జీవం, తయారీ రంగం, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమష్ఠి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కాగా 9.69% వృద్ధి రేటుతో TN తొలి స్థానంలో ఉంది.
News April 6, 2025
ధోనీ రిటైర్మెంట్పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

CSK స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ 2023 ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నారు. ఆ సమయంలో ప్రకటన చేసి ఉంటే ఘనంగా వీడ్కోలు దక్కేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కీపింగ్ అదరగొడుతున్నా ఆయన బ్యాటింగ్ తీరుపై చెన్నై అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా నిన్నటి మ్యాచుతోనే ధోనీ వీడ్కోలు పలుకుతారని ప్రచారం జరిగినా కోచ్ ఫ్లెమింగ్ అలాంటి లేదన్నారు.
News April 6, 2025
పిఠాపురంలో టీడీపీ నేతలపై కేసు

AP: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు <<15990895>>పర్యటన సందర్భంగా <<>>జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన TDP నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.