News August 4, 2025
నీళ్లు లేక ప్లేస్ మార్చారనేది అబద్ధం: ఉత్తమ్

TG: తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్లే ఆ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చినట్లు KCR అబద్ధం చెప్పారని ఉత్తమ్ పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని నాటి కేంద్ర జలమంత్రి ఉమా భారతి పేర్కొన్నా KCR పట్టించుకోలేదని PC ఘోష్ కమిషన్ గుర్తించిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీ సూచించినా గత ప్రభుత్వ పెద్దలు వినలేదని రిపోర్టులో స్పష్టం చేశారని ఉత్తమ్ వెల్లడించారు.
Similar News
News August 16, 2025
ఒప్పందం చేసుకోమని జెలెన్స్కీకి చెప్తా: ట్రంప్

అలాస్కాలో అమెరికా, రష్యా అధ్యక్షుల సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. ‘రష్యాతో ఒప్పందం చేసుకోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సూచిస్తాను. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశమే ఎక్కువుంది. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నాను. జరిగితే ఆ భేటీలో నేను కూడా ఉండే అవకాశం ఉంది’ అని తెలిపారు. పుతిన్తో ఏయే అంశాలపై చర్చించారు అనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.
News August 16, 2025
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కన్నుమూత

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ బాబ్ సిమ్సన్(89) కన్నుమూశారు. 1957 నుంచి 1978 వరకు 68 టెస్టులు ఆడిన ఆయన 4,869 రన్స్ చేశారు. 71 వికెట్లు పడగొట్టారు. అయితే 1968లో క్రికెట్కు గుడ్బై చెప్పిన సిమ్సన్ 1977లో 41 ఏళ్ల వయసులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ మరుసటి ఏడాదే రిటైర్ అయ్యారు. తర్వాత ఆస్ట్రేలియా కోచ్గా మారారు. ఆయన కోచింగ్లోనే AUS 1987 WC, యాషెస్ సిరీస్ గెలిచింది.
News August 16, 2025
ప్చ్.. ‘బ్యాడ్’మింటన్

భారత బ్యాడ్మింటన్లో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సైనా, సింధు, శ్రీకాంత్, సాత్విక్, చిరాగ్ వంటి షట్లర్లు వరల్డ్ టాప్ ర్యాంకులను ఏలారు. ఇప్పుడేమో టాప్10లో సాత్విక్-చిరాగ్ జోడీ(9) మినహా ఎవరూ లేరు. 15లో సింధు, 21లో లక్ష్యసేన్ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోల్చితే దేశంలో బ్యాడ్మింటన్కు ఆదరణ, అకాడమీలకు ప్రోత్సాహం పెరిగాయి. ఆట మాత్రం ‘బ్యాడ్’గా మారింది.