News April 1, 2025

తప్పంతా బ్యాటర్లదే: రహానే

image

IPL-2025: MIతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై KKR కెప్టెన్ రహానే స్పందించారు. మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడానికి బ్యాటర్ల వైఫల్యమే కారణమన్నారు. బౌన్స్‌తో కూడిన మంచి బ్యాటింగ్ పిచ్‌ అయినప్పటికీ భాగస్వామ్యాలు నమోదు కాలేదని చెప్పారు. 180-190 వరకు స్కోర్ చేస్తామని భావించినా పవర్ ప్లే‌లోనే 4వికెట్లు కోల్పోవడంతో సాధ్యపడలేదన్నారు. బౌలర్లు పోరాడినా స్కోర్ పెద్దగా లేకపోవడంతో ఫలితం దక్కలేదని తెలిపారు.

Similar News

News April 2, 2025

HCU భూములపై విచారణ రేపటికి వాయిదా

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు చెట్లు కొట్టేయొద్దని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. మరోవైపు విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా HCU భూముల వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వారం నుంచి జేసీబీలు, పొక్లెయిన్లతో అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగించి చదును చేయిస్తోంది.

News April 2, 2025

RRకు గుడ్ న్యూస్.. సంజూకి లైన్ క్లియర్!

image

సంజూ శాంసన్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. వికెట్ కీపింగ్, కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించేందుకు ఆయనకు BCCI ఆమోదం తెలిపింది. IPLకు ముందు కుడి చూపుడు వేలు ఫ్రాక్చర్ కావడంతో సంజూ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వస్తున్నారు. తాజాగా ఫిట్‌నెస్ టెస్టుల్ని క్లియర్ చేయడంతో బెంగళూరులోని NCA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News April 2, 2025

ముంబై ఫ్రాంచైజీ ఓనర్‌గా సచిన్ కూతురు

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా క్రికెట్లోకి అడుగుపెట్టారు. కానీ ప్లేయర్‌గా కాదు ఓనర్‌గా. గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్‌ లీగ్‌(GEPL)లో ముంబై ఫ్రాంచైజీ యజమానురాలిగా సారా వ్యవహరించనున్నారు. జెట్ సింథెసిస్ నిర్వహించే GEPL.. ఒక ఆన్‌లైన్ గేమింగ్. దీనికి 300మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. Jio సినిమా, స్పోర్ట్స్18లో 2.4 మి. మినిట్స్‌కిపైగా స్ట్రీమింగ్ కంటెంట్ అందుబాటులో ఉంది.

error: Content is protected !!