News February 24, 2025
ఆ ‘నవ్వు’ ఆగి నాలుగేళ్లు అయింది!!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఒకప్పటి రెగ్యులర్ టాపిక్ మనకు ఇప్పుడు మరుగున పడింది. కానీ అక్కడి రణభూమి రగులుతూనే ఉంది. నేటితో మూడేళ్లు పూర్తైన ఈ యుద్ధంతో వేల మంది సైనికులు చనిపోయారు, లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మిలియన్ల మంది రేపు అనేది ఏమిటో తెలియక ఇతర దేశాల్లో శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. ప్రతి గడియ గండంగా గడుపుతున్న ఆ దేశాల వాసులు నవ్వి నాలుగేళ్లు. ఈ నెత్తుటి క్రీడ ఆగేది, ఆరేది ఎప్పుడో?
Similar News
News February 24, 2025
KCRకు సవాల్ విసిరిన సీఎం రేవంత్

TG: కేసీఆర్ గతంలో 12 గంటల్లో సర్వే చేసి ఇప్పుడు తమ కులగణన లెక్కలు తప్పంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలని సవాల్ విసిరారు. ‘కేసీఆర్ సర్వేలో 51 శాతం బీసీలుంటే మా సర్వేలో 56 శాతం ఉన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చారని బండి సంజయ్ అంటున్నారు. దూదేకుల సహా 28 జాతులకు ఎప్పటినుంచో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
News February 24, 2025
గేదెలు కొనేందుకు రెండో పెళ్లి.. ట్విస్ట్ ఏంటంటే?

UPలో గేదెలు కొనేందుకు ఓ మహిళ రెండో పెళ్లికి సిద్ధమైంది. ఆస్మాకు తన భర్తతో విభేదాలు తలెత్తగా కొంత కాలంగా పుట్టింట్లో ఉంటోంది. యోగి ప్రభుత్వం పెళ్లి చేసుకున్న జంటలకు సాయం చేస్తుందని తెలిసి తన బంధువును రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది. తీరా సమయానికి మొదటి భర్త బంధువులు రంగంలోకి దిగడంతో పెళ్లి ఆగిపోయింది. అనధికారకంగా ప్రభుత్వ లబ్ధి పొందేందుకు సిద్ధమైన వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 24, 2025
BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలున్నాయి. మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఉండనుంది. ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమలనాయుడు, రామారావు, తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి, సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.