News July 20, 2024

జగన్ ఏం చేస్తారో కాదు.. మనమేం చేయాలనేదే ముఖ్యం: CBN

image

AP: కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని ఎంపీలకు CM చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. TDP పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో మాట్లాడారు. ‘మంత్రులను వెంటబెట్టుకుని కేంద్రమంత్రుల్ని కలవాలి. విభజన హామీల పరిష్కారానికి కృషి చేయాలి’ అని సూచించారు. ఢిల్లీలో జగన్ ధర్నా అంశం ప్రస్తావనకు రాగా.. ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు, మనమేం చేయాలనేదే ముఖ్యమని CM అన్నారు. AP అభివృద్ధి కోసం పోటీపడి పని చేయాలన్నారు.

Similar News

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.

News December 13, 2025

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ 2 ల్యాబ్ ట్రైనీ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్), బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 18న ఉదయం 9.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎంపికైనవారికి నెలకు జీతం రూ.18,000-రూ.22,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitandhra.ac.in/

News December 13, 2025

ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

image

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.