News October 25, 2025

ఊహించడానికే భయంకరంగా ఉంది: రష్మిక

image

కర్నూలు <<18088805>>బస్సు<<>> ప్రమాద ఘటనపై రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘అగ్ని ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. మంటలలో చిక్కుకున్న ప్రయాణికుల బాధ ఊహించడానికే భయంకరంగా ఉంది. చిన్నపిల్లలు, మొత్తం కుటుంబం, చాలా మంది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి’ అని Xలో పేర్కొన్నారు.

Similar News

News October 25, 2025

మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

News October 25, 2025

US ఆఫీసర్ హత్య.. మోదీని టార్గెట్ చేసినందుకేనా?

image

US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్‌లో హత్యకు గురవడం అనుమానాలకు దారితీసింది. PM మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్‌ను హతమార్చిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్‌ కార్లో రహస్యంగా చర్చించారని పేర్కొన్నాయి. దేశ ప్రజలకు నిజమేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత సింఘ్వీ తాజాగా డిమాండ్ చేశారు.

News October 25, 2025

ఇంటి ఆవరణలో మారేడు మొక్క ఉండవచ్చా?

image

ఇంటి ఆవరణలో మారేడు మొక్క(బిల్వ వృక్షం) ఉండటం శుభకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ఈ మొక్క శివుడికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఇది గృహంలో పరమేశ్వరుని అనుగ్రహాన్ని సూచిస్తుందని అన్నారు. ‘ఇది ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యం, ధనవృద్ధి కలుగుతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>