News July 11, 2024
దేశవ్యాప్తంగా ఒకలా.. ఏపీలో మరోలా!

AP: వర్షపాతం పుష్కలంగా ఉండటంతో దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటిమట్టాలు కళకళలాడుతున్నాయి. ఏపీలో మాత్రం సీన్ రివర్స్లో ఉంది. ప్రధానంగా కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ రెండూ కూడా వెలవెలబోతున్నాయని కేంద్ర జలసంఘం తాజా నివేదికలో తెలిపింది. శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.66 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక సాగర్ సామర్థ్యం 312 టీఎంసీ కాగా 120 టీఎంసీలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News September 16, 2025
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం ‘OG’. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండకపోవచ్చని సినీ వర్గాలు తెలిపాయి. సినిమా రిలీజ్ తేదీ 25న అర్ధరాత్రి ఒంటి గంటకు లేదా తెల్లవారుజామున 4 గంటలకు షోస్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
News September 16, 2025
ACS అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు.. అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నూపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.కోటికి పైగా నగదు, రూ.కోటి విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూ సంబంధిత అంశాలలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 6 నెలలుగా ఆమెపై ప్రత్యేక విజిలెన్స్ సెల్ నిఘా పెట్టినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
News September 16, 2025
పిల్లలకు డైపర్లు వేస్తున్నారా?

పిల్లలకు డైపర్లు వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. *2 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడొచ్చు *ఇంట్లో ఉన్నప్పుడు కాటన్వి, ప్రయాణాల్లో డిస్పోజబుల్ డైపర్లు వాడటం మేలు *డైపర్లను ఎక్కువసేపు మార్చకుండా వదిలేస్తే ఒరుసుకుపోవడం, గజ్జల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది *డైపర్ విప్పాక అవయవాలకు గాలి తగిలేలా ఉండాలి *గోరువెచ్చని నీళ్లతో కడిగేసి సున్నితంగా కాటన్ బట్టతో అద్దాక కొత్తది వేయాలి.