News July 11, 2024

దేశవ్యాప్తంగా ఒకలా.. ఏపీలో మరోలా!

image

AP: వర్షపాతం పుష్కలంగా ఉండటంతో దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటిమట్టాలు కళకళలాడుతున్నాయి. ఏపీలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. ప్రధానంగా క‌ృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ రెండూ కూడా వెలవెలబోతున్నాయని కేంద్ర జలసంఘం తాజా నివేదికలో తెలిపింది. శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.66 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక సాగర్‌ సామర్థ్యం 312 టీఎంసీ కాగా 120 టీఎంసీలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News December 23, 2025

ఉష్ణోగ్రత ఎంత ఉంటే.. చలి అంత ఉన్నట్టా?

image

ఉష్ణోగ్రత ఎంత తగ్గితే చలి తీవ్రత అంత ఎక్కువ అవుతుందనేది ఒకింత నిజమే. అయితే టెంపరేచర్ ఒక్కటే చలిని నిర్ణయించదు. వాతావరణంలోని తేమ, ఎండ.. ముఖ్యంగా గాలి వేగం ప్రభావితం చేస్తాయి. థర్మామీటర్ చూపే ఉష్ణోగ్రత కంటే గాలి వేగం ఎక్కువగా ఉంటే శరీరం నుంచి వేడి త్వరగా పోయి మరింత చల్లగా అనిపిస్తుంది. ఉదాహరణకు గాలి లేకుండా 0°C ఉంటే చల్లగా ఉంటుంది. అదే 0°Cకి 40kmph గాలి కలిస్తే -10°C లాగా అనిపిస్తుంది.

News December 23, 2025

ఢిల్లీ బాటలో ఒడిశా.. మరి మన దగ్గర!

image

పొల్యూషన్ సర్టిఫికెట్‌ ఉన్న వాహనాలకే పెట్రోల్/డీజిల్ విక్రయించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన JAN 1 నుంచి అమలు కానుండగా, ఢిల్లీలో ఇప్పటికే పాటిస్తున్నారు. దేశ రాజధాని మాదిరి అధ్వాన వాయు కాలుష్య పరిస్థితులు రాకూడదంటే తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లోనూ ఈ రూల్ తేవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే మేల్కొంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుందని సూచిస్తున్నారు.

News December 23, 2025

భారత్‌‌లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్

image

<<18623563>>హాదీ<<>> మరణం తర్వాత నెలకొన్న పరిణామాలతో భారత్-బంగ్లా సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా భారతీయులకు కాన్సులర్, వీసా సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ తెలిపింది. అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయం తదుపరి నోటీసులు వచ్చే వరకు కొనసాగుతుందని చెప్పింది. హాదీ మృతి అనంతరం నెలకొన్న ఆందోళనలతో చటోగ్రామ్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్‌ను భారత్ సండే క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.