News April 1, 2025
ఇది భారత్పై ప్రతీకారం తీర్చుకునే సమయం: US

భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని వైట్హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రేపు టారిఫ్లపై తుది నిర్ణయం తీసుకోనున్న వేళ ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు దేశాలు ఎన్నో ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశాన్ని దోచుకుంటున్నాయని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. IND 100% టారిఫ్స్ వసూలు చేస్తోందన్నారు. ఇప్పుడు తమ వంతని స్పష్టం చేశారు.
Similar News
News December 5, 2025
కడప: మేయర్ స్థానానికి ఎన్నిక.. ఆశావహులు వీరే.!

కడప మేయర్ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ స్థానానికి సంబంధించి చాలామంది పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు సురేశ్ బాబు మేయరుగా కొనసాగారు. ఆయనపై అనర్హత వేటు వేయడంతో నూతన ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉంటే వైసీపీకి 39 మంది సపోర్టు ఉంది. దీంతో పాకా సురేశ్, బసవరాజు, గంగాదేవి, మల్లికార్జున, శ్రీలేఖతో పాటు మరి కొంతమంది కార్పొరేటర్లు మేయర్ బరిలో ఉన్నారు.
News December 5, 2025
పుతిన్ పర్యటన.. నేడు కీలకం!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొననున్నారు. 11.50గం.కు <<18467026>>హైదరాబాద్ హౌస్<<>>లో ఈ మీటింగ్ జరగనుంది. రక్షణ బంధాల బలోపేతం, వాణిజ్యం, పౌర అణు ఇంధన సహకారం వంటి అంశాలపై PM మోదీతో చర్చించనున్నారు. S-400, మిసైళ్ల కొనుగోలు, రూపే-మిర్ అనుసంధానం సహా 25 వరకు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అధునాతన S-500 వ్యవస్థ, SU-57 విమానాల కొనుగోలుపైనా చర్చలు జరపనున్నారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

స్క్రబ్ టైఫస్ను వ్యాప్తి చేసే పురుగు పొలాలు, అడవులు, పశుగ్రాసం, తడి నేలల్లో ఎక్కువగా ఉంటోంది. పొలం పనులకు, పశుగ్రాస సేకరణకు వెళ్లే రైతులు తప్పనిసరిగా రబ్బరు బూట్లు, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిసిన దుస్తులు ధరించొద్దు. పొలాల్లో, పశువుల కొట్టాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా పురుగు కుట్టి నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే ఆస్పత్రికి తప్పక వెళ్లండి.


