News November 3, 2024

మధ్యంతర భృతి ప్రకటించాలని జేఏసీ వినతి

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 18 అంశాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హెల్త్ కార్డులు పని చేయడం లేదని, క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ₹25 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలైనా చెల్లించాలని కోరారు.

Similar News

News December 4, 2025

సికింద్రాబాద్‌ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!

image

సికింద్రాబాద్‌ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్‌ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన 4 పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. మరి కొత్త జోన్ ఏర్పాటుపై మీ కామెంట్?

News December 4, 2025

సికింద్రాబాద్‌ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!

image

సికింద్రాబాద్‌ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్‌ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన 4 పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. మరి కొత్త జోన్ ఏర్పాటుపై మీ కామెంట్?

News December 4, 2025

27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం

image

HYDలో భూమి బంగారమైందంటే ఇదేనేమో. కోకాపేట నియోపొలిస్‌లో ప్రభుత్వం 27 ఎకరాలు విక్రయిస్తే ఏకంగా రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ మూడో విడత వేలంలో ప్లాట్ నంబర్ 19లో ఎకరం రూ.131 కోట్లు, 20లో ఎకరం రూ.118 కోట్లు పలికింది. మొత్తం 8.04 ఎకరాలను వేలం వేయగా HMDAకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు రెండు వేలం పాటల్లో రూ.2,700 కోట్లు వచ్చాయి. రికార్డు స్థాయిలో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికింది.