News November 3, 2024
మధ్యంతర భృతి ప్రకటించాలని జేఏసీ వినతి

AP: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 18 అంశాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హెల్త్ కార్డులు పని చేయడం లేదని, క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ₹25 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలైనా చెల్లించాలని కోరారు.
Similar News
News December 13, 2025
పాల మొదటి 2 ధారలు, గోటి పరీక్ష ముఖ్యం

☛ కొన్ని గేదెల పొదుగు పెద్దగా ఉన్నా లోపల పొదుగు వాపు ఉండే ఛాన్సుంది. అందుకే నల్లటి గిన్నెలో పాలను పితికి మొదటి రెండు ధారలను పరిశీలించాలి. అందులో గడ్డలు, రక్తం లేదా నీళ్ల విరుగుడు కనిపిస్తే ఆ గేదెను కొనవద్దు.
☛ మెషిన్ లేకుండానే పాలలో వెన్నశాతం చెక్ చేయాలి. దీనికి పాలు పితికిన వెంటనే ఒక చుక్కపాలను బొటన వేలు గోరు మీద వేయాలి. ఆ చుక్క జారిపోకుండా గోరు మీదే ఉంటే అవి చిక్కటి పాలుగా గుర్తించాలి.
News December 13, 2025
దోషాలను తొలగించే ‘కూష్మాండ దీపం’

ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే అఖండ ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. దృష్టి, నర, శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘ఈ దీపం వెలిగించడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. చండీ హోమంతో సమానమైన ఫలితం దక్కుతుంది. ఆర్థిక, ఆరోగ్య, సంతాన సమస్యలను తొలగించుకోవడానికి ఈ పరిహారం పాటించాలి’ అని సూచిస్తున్నారు. కూష్మాండ దీపాన్ని ఎప్పుడు, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 13, 2025
నిద్రలో పళ్లుకొరుకుతున్నారా?

నిద్రలో కొందరు పళ్లను కొరుకుతుంటారు. దీన్ని బ్రక్సిజం అంటారు. ఎక్కువ ఆందోళన, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్తత ఎక్కువగా ఉంటే నిద్రలో ఇలా పళ్లు కొరుకుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నా వారు నిద్రలో పళ్లను కొరుకుతారని అంటున్నారు. అందుకే చిన్నారులకు పోషకాహారం ఇస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.


