News June 26, 2024
జడేజా ఔట్.. సంజూకు ఛాన్స్?

T20WC: రేపు ఇంగ్లండ్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్కు జడేజాను తప్పించాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతని ప్లేస్లో సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జడేజా WCలో ఒక వికెట్, 15 రన్స్ మాత్రమే చేసి విఫలమయ్యారు. ఆల్రౌండర్లు అక్షర్, హార్దిక్ రాణిస్తున్నందున మరో బ్యాటర్ను తీసుకోవాలని యాజమాన్యం ఫిక్స్ అయ్యిందట. కాగా రేపు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Similar News
News October 24, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

AP: కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదంపై<<>> రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మంత్రి లోకేశ్ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది గుండెలు పగిలే ఘటన అని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.
News October 24, 2025
ఐరన్ మ్యాన్ పోటీల్లో రికార్డు సృష్టించిన రీనీ నోరోన్హా

ప్రపంచంలో అత్యంత కఠినమైన క్రీడాంశాల్లో ఒకటైన ఐరన్మ్యాన్ ట్రయథ్లాన్ను పూర్తి చేసి మన దేశంలో పిన్నవయస్కురాలైన మహిళా ఐరన్మ్యాన్గా చరిత్రకెక్కారు రీనీ నోరోన్హా. 19 ఏళ్ళ రీనీ 3.8 కి.మీ స్విమ్మింగ్, 180 కి.మీ బైక్ రైడ్, 42.2 కి.మీ రన్ ఈవెంట్లను పద్నాలుగు గంటల్లోనే పూర్తి చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె ప్రస్తుతం చెన్నై ఐఐటిలో డేటా సైన్స్ అప్లికేషన్స్లో డిగ్రీ చేస్తున్నారు.
News October 24, 2025
ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణాలు

*బైకును ఢీ కొట్టగానే బస్సును డ్రైవర్ ఆపకుండా కొంతదూరం తీసుకెళ్లాడు. *ఆ టైంలో బైకు పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. *మంటలను ఫైర్ సేఫ్టీ కిట్తో కాకుండా నీళ్లతో ఆర్పే ప్రయత్నంతో వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. *లగ్జరీ, ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. *అర్ధరాత్రి, పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడం.


