News October 29, 2024
జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆగదు: జగదీశ్ రెడ్డి

TG: ప్రభుత్వ తీరుతో ఇంట్లో దావత్ చేసుకోవాలన్నా ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తమను జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆగదని మండిపడ్డారు. కేసీఆర్, మా ఇంటి మీద బాంబులు వేసి చంపుతారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో కొట్లాడి విద్యుత్ బాంబును ఆపేశామన్నారు. రోడ్ల ప్రైవేటైజేషన్ బాంబును కూడా ఆపి, ప్రజలను రక్షిస్తామని చెప్పారు.
Similar News
News December 20, 2025
నిర్మల్ జిల్లాలో రూ.14,67,700 సీజ్: ఎస్పీ

జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా సరిహద్దుల్లోని 12 చెక్పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.14,67,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగదుతో పాటు రూ.7లక్షల విలువైన మద్యం పట్టుబడగా.. గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన 150 కేసుల్లో 201 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
News December 20, 2025
గుజరాత్లో SIR.. 73 లక్షల ఓట్లు తొలగింపు

గుజరాత్లో నిర్వహించిన SIRలో 73,73,327 ఓట్లను అధికారులు తొలగించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5.08 కోట్ల నుంచి 43.47 కోట్లకు తగ్గిందని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ద్వారా తెలుస్తోంది. అభ్యంతరాలను జనవరి 18, 2026లోగా తెలియజేయాలి. వాటిని ఫిబ్రవరి 10లోగా అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. తొలగించిన ఓట్లలో 18 లక్షల మంది మరణించిన వారివి కాగా శాశ్వతంగా నివాసం మారిన ఓట్లు 40 లక్షలుగా గుర్తించారు.
News December 20, 2025
T20ల్లో తిరుగులేని జట్టుగా టీమ్ఇండియా!

టీ20 సిరీసుల్లో భారత్ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా SAపై సిరీస్ గెలుపుతో IND వరుసగా 8వ ద్వైపాక్షిక T20 సిరీస్ను సొంతం చేసుకుంది. 2023 డిసెంబర్ నుంచి ఇది కొనసాగుతోంది. మొత్తంగా భారత్ వరుసగా 14 సిరీస్లు(ద్వైపాక్షిక+ టోర్నమెంట్లు) గెలిచింది. ఇందులో 2023 ఏషియన్ గేమ్స్, 2024 T20 వరల్డ్ కప్, 2025 ఆసియా కప్ కూడా ఉన్నాయి. టీమ్ఇండియా చివరిసారి 2023 ఆగస్టులో WIపై 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.


