News August 9, 2024

BJPకి వ్యతిరేకంగా జగన్?

image

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు YCP స్పష్టం చేయడంతో ఆ పార్టీ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. జగన్ CMగా ఉన్నప్పుడు కేంద్రం తెచ్చిన రైతు చట్టాలతో పాటు CAA, NRC బిల్లులను వైసీపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు BJPకి చంద్రబాబు, పవన్ అనుకూలంగా ఉండటంతో తామూ అటువైపుగా వెళ్తే రాజకీయంగా నష్టపోతామన్న భావనతో జగన్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఇండియా కూటమివైపు వెళ్తున్నారని సమాచారం.

Similar News

News December 10, 2025

ఆ లెక్కలు చంద్రబాబు సృష్టే: జగన్

image

AP: 2025-26 ఏడాదికి ప్రభుత్వం ఇచ్చిన GSDP అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. ‘ప్రజలను మోసం చేసేందుకే ఈ గణాంకాలను CBN మార్గదర్శకత్వంలో తయారు చేశారు. కాగ్ నివేదికలు నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. వాటి ప్రకారం ఆదాయాల పెరుగుదల తగ్గి, అప్పులు పెరిగాయి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు, పెట్టుబడులు తగ్గాయి. రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News December 10, 2025

బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా

image

టీమ్ ఇండియా దిగ్గజ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశారు. SAతో జరిగిన తొలి టీ20లో బ్రెవిస్‌ని ఔట్ చేసి 100 వికెట్స్ క్లబ్‌లో చేరారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ తర్వాత ఈ ఘనత సాధించింది బుమ్రానే కావడం విశేషం. అలాగే అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది ఉన్నారు.

News December 10, 2025

న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

image

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <>ట్వీట్<<>> చేశారు.