News July 6, 2024
ప్యాలెస్, ఫామ్ హౌస్ సీఎంలుగా జగన్, KCR వ్యవహరించారు: సోమిరెడ్డి
AP: తెలుగు రాష్ట్రాల మాజీ CMలు KCR, జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి Xలో విమర్శలు గుప్పించారు. ‘మొన్నటి వరకు ఒకరు ప్యాలెస్ సీఎంగా, మరొకరు ఫామ్ హౌస్ సీఎంగా వ్యవహరించి నియంతలుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత CMలు రేవంత్, చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రజా భవన్లో నేడు చర్చించనున్నారు. తెలుగు ప్రజలకు ఇక మంచిరోజులు.. తెలుగు జాతికి నిండు వెలుగులు’ అని రాసుకొచ్చారు.
Similar News
News October 14, 2024
డీఎస్సీ ఫ్రీ కోచింగ్.. ఆ అభ్యర్థులకు గమనిక
AP: డీఎస్సీ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేసిన వారు జ్ఞానభూమి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలంది. ఈ నెల 27న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. అర్హులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తామంది.
News October 14, 2024
‘కంగువ’ డబ్బింగ్ కోసం అధునాతన టెక్నాలజీ!
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ వచ్చే నెల 14వ తేదీన ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది. అయితే, దీనికోసం మూవీ టీమ్ డబ్బింగ్ ఆర్టిస్టును ఉపయోగించలేదు. దర్శకుడు శివ అతని బృందం అధునాతన AI సాంకేతికతను ఉపయోగించినట్లు సినీవర్గాలు తెలిపాయి. సూర్య వాయిస్ని ప్రతి భాషలో AI డబ్బింగ్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, ఈనెల 20న జరిగే ఆడియో లాంచ్కు సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభాస్లను ఆహ్వానించినట్లు సమాచారం.
News October 14, 2024
అలాంటి నాయకులను నమ్మొద్దు: అశోక్గజపతి రాజు
AP: గత ఐదేళ్లలో ఆలయాలను భ్రష్టు పట్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు మండిపడ్డారు. APలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ చేశారని ఆరోపించారు. రామతీర్థ విగ్రహాన్ని ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని దుయ్యబట్టారు. నాడు విగ్రహం కోసం నిధులు సేకరించి పంపిస్తే వెనక్కి పంపారన్నారు. ఇంట్లో ఒక మతం, బయట మరో మతంపై మాట్లాడే నాయకులను నమ్మొద్దని, తమ ప్రభుత్వంలో ఆలయాల నిర్వహణ సవ్యంగా సాగుతోందన్నారు.