News November 28, 2024

ఓడించారనే ప్రజలపై జగన్‌ నిందలు: మంత్రి సత్యకుమార్

image

AP: ఓడించారనే అక్కసుతో రాష్ట్ర ప్రజలను మాజీ CM జగన్ నిందిస్తున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. అధికారం లేదనే నిరాశ, నిస్పృహ ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘వైద్యారోగ్య శాఖలో 52 వేల మంది ఉద్యోగులను నియమించానని జగన్ అబద్ధాలు చెబుతున్నారు. అదే నిజమైతే బహిరంగ క్షమాపణలు చెబుతా. సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత 4 శాతమేనని చెప్పడం విడ్డూరం. ఇది 59 శాతంగా ఉంది’ అని ఆయన చెప్పారు.

Similar News

News December 6, 2025

BSBD అకౌంట్లు.. ఇక నుంచి ఫ్రీగా..

image

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు RBI గుడ్ న్యూస్ చెప్పింది.
*డిజిటల్ ట్రాన్సాక్షన్లపై నో లిమిట్
*అన్‌లిమిటెడ్ డిపాజిట్లు. నో డిపాజిట్ ఫీజు
*నెలకు 4 ఫ్రీ ATM విత్‌డ్రాలు, ఉచితంగా ATM/డెబిట్ కార్డు (వార్షిక ఫీజు లేకుండా)
*ఏడాదికి 25 చెక్ లీఫ్స్, ఫ్రీగా పాస్‌బుక్/స్టేట్‌మెంట్స్
>BSBD అంటే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. APR 1, 2026 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

News December 6, 2025

శరీరాకృతికి తగ్గ దుస్తులు వేసుకుంటేనే..

image

కొంతమందికి మంచి పర్సనాలిటీ ఉన్నా ఎంత మంచి దుస్తులు వేసుకున్నా ఆకర్షణీయంగా ఉండరు. అందుకే మన దుస్తుల ఎంపిక మనసుకు నచ్చినట్లు మాత్రమే కాకుండా, శరీరాకృతికి తగ్గట్లుగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మన శరీర ప్రత్యేకతను ముందుగా గుర్తించాలి. అలాగే లోపంగా అనిపించే ప్రాంతాన్నీ తెలుసుకోగలగాలి. రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఫ్యాషన్ క్వీన్‌లా మెరిసిపోవచ్చంటున్నారు.

News December 6, 2025

సిరి సంపదలను కలిగించే ‘వ్యూహ లక్ష్మి’

image

శ్రీవారి వక్ష స్థలంలో ‘వ్యూహ లక్ష్మి’ కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు. తిరుమల వెళ్లి వ్యూహ లక్ష్మిని దర్శించుకున్నా, ఇంట్లో వ్యూహలక్ష్మిని పూజించినా అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం. శ్రీవారి మూలవిరాట్టుపై అమ్మవారు ఎప్పుడూ పసుపు అచ్చుతో కప్పబడి ఉంటారు. ఆ పసుపును మనం ప్రసాదంగా పొందవచ్చు. ☞ అదెలాగో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.