News March 29, 2024

జగన్ అజ్ఞానానికి ఎవరేం చేయగలం: CBN

image

AP: తాను ప్రజలకు ఏం చేశానని సీఎం జగన్ అడుగుతున్నారని, ఆ విషయం రాష్ట్రంలోని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్‌కు తెలియకపోవడం ఆయన అజ్ఞానం అని, దానికి ఎవరేం చేయగలమని బాబు ప్రశ్నించారు. ‘జగన్.. నా వయసు గురించి మాట్లాడతాడు. నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?’ అని సవాల్ విసిరారు.

Similar News

News September 18, 2025

త్వరలో US టారిఫ్స్‌ ఎత్తివేసే ఛాన్స్: CEA

image

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్‌ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్‌కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

News September 18, 2025

పిల్లలు మొబైల్ / టీవీ చూస్తున్నారా?

image

పిల్లలు అల్లరి చేయగానే ఫోన్, టీవీ చూపించడం అలవాటు చేస్తున్నారా? ఇది మీ కోసమే. తాజా అధ్యయనం ప్రకారం పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా నిద్ర తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందట. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం, శారీరక శ్రమను ప్రోత్సహిస్తే ఈ ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

News September 18, 2025

మరికాసేపట్లో నీరజ్ ఫైనల్ ఈవెంట్

image

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్ సా.3.53 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇండియా తరఫున నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నారు. ఫైనల్ ఈవెంట్లో మొత్తం 12 మంది పోటీ పడుతున్నారు. అయితే జూలియన్ వెబెర్(జర్మనీ) పెటెర్స్(గ్రెనెడా), అర్షద్ నదీమ్(పాక్) నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. వారందరినీ వెనక్కి నెట్టి అతడు బంగారు పతకం సాధించాలని కోరుకుందాం.
ALL THE BEST NEERAJ(హాట్‌స్టార్‌లో లైవ్)