News September 21, 2024
జగన్.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా?: హోం మంత్రి అనిత
AP: గత వైసీపీ పాలకులు అన్ని వ్యవస్థల్లానే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని హోం మంత్రి అనిత మండిపడ్డారు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడకుండా బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. దైవంతో పెట్టుకున్నారు కాబట్టే 11 సీట్లు వచ్చాయని, ఇలాగే కొనసాగితే పులివెందులలోనూ ఓడిపోయే పరిస్థితి తప్పదన్నారు. 100 రోజుల పాలనలో విఫలమయ్యారని గదిలో ఉండి మాట్లాడటం కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలని జగన్కు ఆమె సవాల్ విసిరారు.
Similar News
News September 21, 2024
మాధబి సమాచారం ఇచ్చేందుకు సెబీ నిరాకరణ
తమ ఛైర్మన్ మాధబికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడానికి సెబీ నిరాకరించింది. ఆస్తులు, ఈక్విటీలపై మాధబీ సమర్పించిన డిక్లరేషన్లను బహిర్గతం చేయడం ఆమె వ్యక్తిగత భద్రతను ప్రమాదంలో పడేసినట్టే అవుతుందని RTI దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణంగా ఆమె తప్పుకున్న కేసుల వివరాలు అందుబాటులో లేవని, వాటిని క్రోడీకరించడానికి అధిక సమయం పడుతుందని తెలిపింది.
News September 21, 2024
కుక్కలకు పాండాలుగా రంగులు.. చైనాలో సందర్శకుల ఆగ్రహం
పాండాలను చూసేందుకు వచ్చే సందర్శకులను చైనాలో కొన్ని జూలు మోసం చేస్తున్నాయి. తాజాగా షాన్వీ జూలో కుక్కలకు పాండాల్లా రంగులు వేస్తున్నారని ఆరోపిస్తూ ఓ సందర్శకుడు వీడియో తీసి నెట్లో పెట్టారు. తొలుత అవి పాండా డాగ్స్ అనే జాతి అంటూ బుకాయించిన జూ నిర్వాహకులు, తర్వాత ఆరోపణలు నిజమని ఒప్పుకొన్నారు. దీంతో సందర్శకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ డబ్బులు వెనక్కివ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
News September 21, 2024
JKకు రాష్ట్ర హోదా మా ప్రాధాన్యం: కాంగ్రెస్
జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యమని కాంగ్రెస్ తెలిపింది. జమ్మూలో ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ JKకు కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీల్లో రాష్ట్ర హోదా మొదటి ప్రాధాన్యమన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్కు బీజేపీ చేసిందేమీ లేదని, ఉద్యోగాల పేరుతో యువతను వంచించిందని ఖర్గే విమర్శించారు.