News September 21, 2024
జగన్.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా?: హోం మంత్రి అనిత

AP: గత వైసీపీ పాలకులు అన్ని వ్యవస్థల్లానే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని హోం మంత్రి అనిత మండిపడ్డారు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడకుండా బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. దైవంతో పెట్టుకున్నారు కాబట్టే 11 సీట్లు వచ్చాయని, ఇలాగే కొనసాగితే పులివెందులలోనూ ఓడిపోయే పరిస్థితి తప్పదన్నారు. 100 రోజుల పాలనలో విఫలమయ్యారని గదిలో ఉండి మాట్లాడటం కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలని జగన్కు ఆమె సవాల్ విసిరారు.
Similar News
News December 9, 2025
నేడే తొలి T20.. హై స్కోరింగ్ గేమ్!

SAతో భారత్ 5 మ్యాచుల T20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్లో జరగనుంది. ఇది బ్యాటర్లకు అనుకూలించే పిచ్ కావడం, 2 జట్లలో హిట్టర్లు ఉండటంతో హైస్కోరింగ్ గేమ్ చూసే అవకాశముందని క్రీడావర్గాలు చెబుతున్నాయి. 2015, 2022లో ఇక్కడ SAతో భారత్ ఆడిన 2 T20ల్లోనూ ఓడింది. అటు ఇవాళ ఓ వికెట్ తీస్తే 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా రికార్డ్ సృష్టించనున్నారు. 7PMకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
News December 9, 2025
మోక్షాన్ని కలిగించే సప్త క్షేత్రాలు

అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, ద్వారక.. ఈ 7 నగరాలను ముక్తి స్థలాలు అంటారు. ఇక్కడ కొలువైన క్షేత్రాలను దర్శించుకుంటే మనిషికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. జీవితంలో ఒక్కసారైనా ఈ స్థలాలను దర్శించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చేసిన పాపాలు తొలగించుకోవడానికి, పరమాత్మ సాన్నిధ్యం పొందే అవకాశం కోసం చాలామంది ఇక్కడికి వెళ్తుంటారు. ఈ పవిత్ర క్షేత్రాలు భక్తిని, ఆధ్యాత్మికతను పెంచుతాయి.
News December 9, 2025
ఏపీలో US పెట్టుబడులకు సహకరించండి: లోకేశ్

APకి 18నెలల్లో రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. దేశంలోనే తొలిసారి MOUల తర్వాత నిర్ణీత సమయంలో పరిశ్రమలను గ్రౌండింగ్ చేసే సంస్థలకు <<18509404>>ఎస్క్రో అకౌంట్<<>> ద్వారా ప్రోత్సాహకాలను జమ చేయనున్నట్లు చెప్పారు. అమరావతిలో అతి త్వరలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబోతోందని, APలో US పెట్టుబడులకు సహకరించాలని శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో భేటీ సందర్భంగా కోరారు.


