News October 11, 2024
వరదల్లో జగన్ అడుగు బయటపెట్టలేదు: లోకేశ్

AP: చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్బుక్లో పేరుందని వారు భయపడుతున్నారన్నారు. వరదలొచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టలేదని, ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 15, 2025
సాఫ్ట్బాల్ బాలికల టైటిల్ విజయనగరానికే

రాష్ట్రస్థాయి అండర్-17 స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీల్లో విజయనగరం జట్టు బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు నిలిచాయి. పోటీలు ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి దుర్గ ఆదివారం ప్రకటించారు.
News December 15, 2025
‘AGRATE’ ఏం చేస్తుంది?

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.
News December 15, 2025
ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

టాలీవుడ్ సీనియర్ హీరో శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ చిత్రం ఈ నెల 19న రీరిలీజ్ కానుంది. చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అదే రోజున HYDలో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్కు ఈ మూవీ మంచి పేరు తీసుకొచ్చిందని నిర్మాత సురేశ్ బాబు తెలిపారు. నటుడిగానే కాకుండా వ్యక్తిగానూ శోభన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు.


