News April 17, 2024
మోదీతో మాట్లాడే ధైర్యం జగన్కు లేదు: పవన్

AP: నరేంద్ర మోదీతో మాట్లాడే ధైర్యం జగన్కు లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘జగన్ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాడట. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై చర్చ సమయంలో సోనియా గాంధీ ముందు ప్లకార్డు పట్టుకోలేని పిరికివాడివి నువ్వు. అలాంటిది మోదీతో మాట్లాడగలవా?’ అని ఫైరయ్యారు. సంపద సృష్టించడం కంటే డబ్బులు పంచడం చాలా సులభం అని పవన్ వ్యాఖ్యానించారు.
Similar News
News December 22, 2025
ఆధిపత్యం కోసం ఆరాటం.. అప్పుల ఊబిలో క్విక్ కామర్స్ సైట్స్!

10 నిమిషాల డెలివరీతో కిరాణ దుకాణాల మనుగడను దెబ్బతీస్తోన్న క్విక్ కామర్స్ సైట్స్ కూడా ₹వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఇన్స్టామార్ట్ ₹వెయ్యి కోట్లు, జెప్టో ₹1,250 కోట్లు, బ్లింకిట్ ₹110 కోట్లు లాస్లో ఉండి ఇన్వెస్టర్లను సైతం ఇబ్బందుల్లోకి నెట్టాయని నిపుణులు చెబుతున్నారు. దుకాణానికి వెళ్లే సంస్కృతిని దూరం చేసి ఫ్యూచర్లో గుత్తాధిపత్యం సాధించి కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.
News December 22, 2025
ఆస్తి పన్ను బకాయిలపై భారీ డిస్కౌంట్

TG: ఆస్తి పన్నుకు సంబంధించి HYD వాసులకు ప్రభుత్వం ‘వన్ టైం స్కీమ్’ (OTS) ప్రకటించింది. తాజాగా విడుదలైన G.O.Rt.No.869 ప్రకారం పాత బకాయిలపై ఉన్న వడ్డీలో 90% రద్దు చేస్తోంది. అసలు పన్ను మొత్తంతో పాటు కేవలం 10% వడ్డీని ఒకేసారి చెల్లిస్తే సరిపోతుంది. ప్రైవేట్ యజమానులకు, ప్రభుత్వ సంస్థలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
News December 22, 2025
GHMC డీలిమిటేషన్పై పిటిషన్ల కొట్టివేత

TG: GHMC డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల గ్రేటర్లో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.


