News April 17, 2024
మోదీతో మాట్లాడే ధైర్యం జగన్కు లేదు: పవన్

AP: నరేంద్ర మోదీతో మాట్లాడే ధైర్యం జగన్కు లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘జగన్ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాడట. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై చర్చ సమయంలో సోనియా గాంధీ ముందు ప్లకార్డు పట్టుకోలేని పిరికివాడివి నువ్వు. అలాంటిది మోదీతో మాట్లాడగలవా?’ అని ఫైరయ్యారు. సంపద సృష్టించడం కంటే డబ్బులు పంచడం చాలా సులభం అని పవన్ వ్యాఖ్యానించారు.
Similar News
News December 22, 2025
Jan 1 నుంచి కొత్త పే కమిషన్? శాలరీలు పెరుగుతాయా?

8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు బేసిక్పై 20%-35% పెరగొచ్చని అంటున్నారు. 2025 నవంబర్లో కమిషన్ను ప్రభుత్వం నోటిఫై చేసింది. రిపోర్ట్ రావడానికి ఇంకా టైమ్ పట్టినా.. పెరిగిన శాలరీ, పెన్షన్ను 2026 Jan నుంచే వర్తింపజేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 22, 2025
పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు: జూపల్లి

TG: పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని <<18633566>>KCR<<>>ను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ‘BRS పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. వారి హయాంలో ప్రధాన కాలువలు పూర్తి చేయలేదు. పాలమూరు-RRని తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన KCR ఇప్పుడేమో సాగునీటి ప్రాజెక్టు అంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.40-50 వేల కోట్లు కావాలి’ అని చెప్పారు.
News December 22, 2025
మినుము, పెసర.. 20 రోజులు దాటాకా కలుపు నివారణ

మినుము, పెసర విత్తిన 20 రోజులకు గడ్డిజాతికి చెందిన కలుపు మొక్కలు మాత్రమే 2,3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో క్విజాలోఫాప్ ఇథైల్ 5% 400ml లేదా ప్రొపాక్విజాఫాప్ 10% 250ml కలిపి పిచికారీ చేయాలి. పొలంలో గడ్డిజాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200ml లేదా ఫోమెసాఫెన్ 11.1% + ఫ్లుజిఫాప్-పి-బ్యుటెల్ 11.1% 400 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.


