News July 24, 2024
ఢిల్లీలో జగన్ డ్రామా: హోంమంత్రి అనిత

AP: సినిమా సెట్టింగులా మాజీ సీఎం జగన్ ధర్నా ఉందని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారంతో, ఢిల్లీలో జగన్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 36 మంది హత్యకు గురైతే ఇప్పుడు ఎందుకు జగన్ బయటకు వచ్చారని ప్రశ్నించారు. మరణించిన వారి పేర్లు ఇవ్వాలని కోరారు. అవతలి వాళ్లు నమ్మలేని విధంగా జగన్ ధర్నా ఉందని అన్నారు.
Similar News
News October 19, 2025
బాహుబలి ది ఎపిక్.. ఎనిమిదేళ్ల కిందటి ట్వీట్ వైరల్

బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించేందుకు ‘బాహుబలి ది ఎపిక్’ సిద్ధమవుతోంది. 2 భాగాలు కలిపి ఒకే పార్టుగా ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల కిందట బిజినెస్మ్యాన్ నారాయణరావు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘బాహుబలి పార్ట్ 1&2 కలిపి ఓ సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. మళ్లీ తక్కువలో తక్కువ రూ.500 కోట్లు రాబట్టవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
News October 19, 2025
ఇస్రో షార్ 141 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఇస్రో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ 141 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ, BSc, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://www.isro.gov.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 19, 2025
దీపారాధన సమయంలో చదవాల్సిన మంత్రం

దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥
దీపం జ్యోతి సాక్షాత్తూ దైవస్వరూపం. ఇది అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే వెలుగును ఇస్తుంది. దీపం వల్లే మన కార్యాలన్నీ సుగమం అవుతాయి. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా పూజిస్తూ ‘సంధ్యా దీపమా! నీకు నమస్కారం’ అని అంటాం. ఎవరి ఇంట అయితే దీపాలెప్పుడూ వెలుగుతూ ఉంటాయో.. వారే నిజమైన ఐశ్వర్యవంతులని పెద్దలు చెబుతారు.