News July 24, 2024
ఢిల్లీలో జగన్ డ్రామా: హోంమంత్రి అనిత

AP: సినిమా సెట్టింగులా మాజీ సీఎం జగన్ ధర్నా ఉందని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారంతో, ఢిల్లీలో జగన్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 36 మంది హత్యకు గురైతే ఇప్పుడు ఎందుకు జగన్ బయటకు వచ్చారని ప్రశ్నించారు. మరణించిన వారి పేర్లు ఇవ్వాలని కోరారు. అవతలి వాళ్లు నమ్మలేని విధంగా జగన్ ధర్నా ఉందని అన్నారు.
Similar News
News January 22, 2026
WPL: ఓడితే ఇంటికే..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో మ్యాచులు రసవత్తరంగా మారాయి. RCB(10 పాయింట్లు) మినహా MI, UP, DC, GG నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ జట్లన్నీ తమ తదుపరి మ్యాచులన్నీ తప్పక గెలవాలి. లేదంటే ఇంటిబాట పడతాయి. ఇవాళ యూపీ-గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన యూపీ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ వేళ ఈ మ్యాచ్ ఇరుజట్లకూ చావో రేవో కానుంది.
News January 22, 2026
క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై పరిమితి విధించాలి: పురందీశ్వరి

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాలని BJP MP పురందీశ్వరి కోరారు. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు RBI మార్గదర్శకాలకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్కు వినతిపత్రం ఇచ్చారు. భారత్లో 24-48%, కొన్ని చోట్ల 55%+ వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ విధిస్తున్నారని, USలో వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేశారని గుర్తుచేశారు.
News January 22, 2026
భారత్ అంత చేసినా.. బరితెగించిన బంగ్లా!

భారత్లో T20 WC ఆడబోమన్న బంగ్లాదేశ్పై టీమ్ ఇండియా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. వాస్తవానికి ఆ దేశ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించిందే BCCI. 1988లో BCBకి అప్పటి ICC ఛైర్మన్ జగ్మోహన్ దాల్మియా ICCలో సభ్యత్వం ఇప్పించారు. తర్వాత BCCI ఆ జట్టుకు టెస్ట్ హోదా లభించేలా చేసింది. ఇంకా చెప్పాలంటే 1971లో పాకిస్థాన్తో పోరాడి బంగ్లాను స్వతంత్ర దేశంగా చేసిందే భారత్. బంగ్లా తీరుపై మీరేమంటారు?


