News March 30, 2024
మూకుమ్మడి రాజీనామాల పేరుతో జగన్ డ్రామాలు: షర్మిల

AP: తాము అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల అన్నారు. విజయవాడలో పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామాల పేరుతో డ్రామా చేశారని దుయ్యబట్టారు. 23 మంది వైసీపీ ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు.
Similar News
News November 28, 2025
సెబీలో పెరిగిన పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సెబీలో 110పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా 135కు పెంచారు. జనరల్ విభాగంలో 56 పోస్టులకుగాను 77కు, రీసెర్చ్ విభాగంలో 4 ఉండగా.. 8కి పెంచారు. మిగిలిన విభాగాల్లో పోస్టులను పెంచలేదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ / PG డిప్లొమా, LLB, BE/B.Tech, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: sebi.gov.in
News November 28, 2025
ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా?

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఆయన 845 రోజులుగా నిర్బంధంలోనే ఉండగా.. గత నెల నుంచి ఆయనను ఎవరూ కలవకుండా ‘డెత్ సెల్’లో వేశారు. ఇమ్రాన్ను చంపడం వల్లే ఎవరినీ అనుమతించడం లేదని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. కానీ అలాంటిదేమీ లేదని పాక్ ప్రభుత్వం బుకాయిస్తోంది. అలాంటప్పుడు ఆయనను బయటి ప్రపంచానికి చూపించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
News November 28, 2025
అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.


