News April 3, 2025
పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది: సునీత

AP: YCP అధినేత జగన్పై MLA పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది. ఆ కేసులో CBI ఆయన్ను విచారించింది. రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారు. ఓబుల్రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారు. ఆ సోదరుల మాటలు నమ్మి కుట్రలో భాగస్వామ్యం కావొద్దు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చుపెట్టొద్దు జగన్’ అని సునీత హెచ్చరించారు.
Similar News
News January 30, 2026
టమాటా రైతుల ఆవేదన.. కిలో రూపాయి కూడా లేదు!

AP: టమాటా ధరలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. 3నెలల క్రితం కిలో రూ.60 పలికిన టమాటాకి ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన నాణ్యమైన రకం ఇప్పుడు రూ.7 కూడా పడట్లేదని వాపోతున్నారు. మూడో రకమైతే రూపాయి కూడా రావట్లేదని చెబుతున్నారు. కోత కూలీ, ప్రయాణ ఖర్చులు కూడా రావట్లేదని కొందరు రైతులు పంటను వదిలేస్తున్నారు.
News January 30, 2026
కెనడా విమానాలపై ట్రంప్ టారిఫ్ బాంబ్

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50% టారిఫ్లు వేస్తానని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికన్ గల్ఫ్స్ట్రీమ్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వకపోవడమే కారణమని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా బొంబార్డియర్ సహా కెనడియన్ విమానాల సర్టిఫికేషన్ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల <<18949938>>కెనడాపై<<>> 100% సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించారు.
News January 30, 2026
TMC or BJP: బెంగాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే?

ఇప్పటికిప్పుడు LS ఎన్నికలు జరిగితే బెంగాల్లో TMC 28, BJP 14 స్థానాల్లో గెలుస్తాయని ‘India Today’ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. 2024 ఎలక్షన్స్లో TMC 29, BJP 12 సీట్లు గెలిచాయి. అయితే గతేడాది AUG సర్వేలో TMC 31, BJPకి 11 సీట్లు రాగా ఇప్పుడు కమలం పార్టీకి మెజార్టీ పెరగడం గమనార్హం. అదే సమయంలో TMC సీట్లు తగ్గాయి. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయం కానుంది.


